ఆ హీరోయిన్లు ఎవరూ కాదంటున్న లారెన్స్

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటించిన 'చంద్రముఖి' చిత్రం 2005 లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. హారర్ జానర్లో అలా ఒక స్టార్ హీరో హీరో నటించిన సినిమా విజయం సాధించడం అప్పట్లో అది ఒక సంచలనం. చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఆ సినిమాకు లారెన్స్ రాఘవేంద్ర ఆ సినిమాకు సీక్వెల్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.


ఈ సినిమా గురించి గత కొంత కాలంగా కోలీవుడ్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా జ్యోతిక, సిమ్రాన్ కియారా అద్వానీ పేర్లను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది అయితే ఈ మధ్య ఈ వార్తలపై స్పందించిన లారెన్స్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం ఈ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, ఇంకా హీరోయిన్ల ఎంపిక వరకు రాలేదు అని తేల్చి చెప్పారు. బయట జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని అన్నారు. 


ఇదిలా ఉంటే లారెన్స్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ చిత్రం 'లక్ష్మీ బాంబ్' త్వరలోనే ఓటిటి రిలీజ్ కానుంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, కియారా అద్వాని ప్రధాన పాత్రల్లో నటించారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS