రంగమ్మత్త పరిస్థితి ఏంటంటే!

మరిన్ని వార్తలు

'రంగమ్మత్త'గా టాలీవుడ్‌లో అనసూయ వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. ఆ సినిమాతో ఏకంగా హీరోయిన్‌ సమంతకు ఈక్వెల్‌గా క్రేజ్‌ దక్కించుకుంది అనసూయా భరద్వాజ్‌. కానీ, ఆ క్రేజ్‌ ఎంతో కాలం నిలిచినట్లు లేదు. షరా మామూలుగానే 'రంగస్థలం' మేనియా ఉన్నంత వరకూ రంగమ్మత్త మేనియా కొనసాగింది. ఆ తర్వాత ఒకటీ అరా సినిమాల్లో ఛాన్సులు దక్కించుకున్నా, అవేమీ రంగమ్మత్త పాత్ర దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయాయి. ఆ సంగతి అటుంచితే, తాజాగా అనసూయ 'కథనం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

ఈ సినిమాలో అనసూయ ప్రధాన పాత్రలో హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీగా తెరకెక్కింది. సినిమాలో కంటెంట్‌ ఆసక్తికరంగానే ఉన్నట్లు ప్రచార చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఫిలిం డైరెక్టర్‌ పాత్రలో అనసూయ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది సినిమాలో. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ తదితర ఎమోషన్స్‌ కూడా ప్రదర్శించింది. అయితే, ఈ సినిమాకి రిలీజ్‌ స్లాట్‌ కరెక్ట్‌గా లేదని ఆమె అభిమానులు కొందరు అభిప్రాయ పడుతున్నారు.

 

ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వస్తోన్న 'కథనం', నాగార్జున 'మన్మధుడు 2'తో పోటీ పడడమే ఏమంత బాగోలేదంటున్నారు. అసలే 'మన్మధుడు 2' పిచ్చ పిచ్చగా ప్రమోషన్స్‌ నిర్వహించి, ఓ లెవల్లో బజ్‌ క్రియేట్‌ చేసేశాడు సినిమా మీద. అనసూయ మాత్రం కనీస పాటి ప్రమోషన్స్‌ కూడా చేయడంలో విఫలమైంది. సోషల్‌ మీడియాలో అనసూయకి ఫుల్‌గా ఫాలోయింగ్‌ ఉంది. కానీ, ఆ ఫాలోయింగ్‌ 'కథనం' మినిమమ్‌ ఓపెనింగ్స్‌కైనా కలిసొస్తుందా.? చూడాలి మరి, అనసూయ స్టామినా ఏంటో ఈ సినిమాతో తేలిపోనుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS