మహర్షి.. ఓ తెల్ల ఏనుగు ?

మరిన్ని వార్తలు

ఇండస్ట్రీలో కొన్ని సంగతులు లేటుగా వెలుగులోకి వస్తాయి. మొదటి దాచుకున్న తర్వాత ఏదో పాయింట్ లో ఓపెన్ అవుతారు. ఇప్పుడు దిల్ రాజు కూడా ఓ విషయంలో ఓపెన్ అయ్యారు. మహేష్ తో మహర్షి సినిమా తీసిన నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. సినిమా యూనిట్ చేసిన ప్రచారం ప్రకారం మహర్షి నాన్ బాహుబలి రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేసింది. అలా ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు మేటర్ ఏమిటంటే.. మహర్షి సినిమా జరుగుతున్నపుడే వంశీపైడిపల్లి- మహేష్ తో మరో సినిమాకి మాటిచ్చారు దిల్ రాజు. అయితే ఇప్పుడీ సినిమా డైలామాలో పడింది. దీనికి కారణం మహర్షి సినిమా.

 

మహర్షి సినిమా సాధించిన వసుళ్ళూ, సినిమాకి పెట్టిన ఖర్చు లెక్కలు వేసుకుంటే ఆ ప్రాజెక్ట్ తెల్ల ఏనుగని తేలింది. నిర్మాతలు వెనక్కి వేసుకున్నది ఏమీ లేదని ఇన్ సైడ్ టాక్. దర్శకుడుకి రెమ్యునిరేషన్ వెళ్ళింది. హీరో మహేష్ బాబు.. నాన్ థియేటర్ రైట్స్ ని రెమ్యునిరేషన్ కింద తీసుకున్నారు. మిగిలినది వాటాలు వేయగా మహర్షి తెల్ల ఏనుగైయిందని భోగట్టా. ఇప్పుడు అదే దిల్ రాజుని ఆలోచనల్లో పడేసింది. మహేష్- వంశీ సినిమాపై ఆయన అంత ఆసక్తి చూపడం లేదని ఇన్ సైడ్ టాక్. మహర్షి బండి బలవంతంగా లాక్కొచ్చారనే సంగతి మాత్రం వాస్తవం. తేడాకొడితే మాత్రం కోలుకోవడం కష్టం. అందుకే ఈసారి రిస్క్ తీసుకోలేకపోతున్నారట దిల్ రాజు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS