మ‌హేష్‌తో అనుష్క.. నిజ‌మేనా?

మరిన్ని వార్తలు

మ‌హేష్ బాబు - అనుష్క‌ల కాంబినేష‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ ఒకే ఒక్క సినిమా వ‌చ్చింది. అదే.. `ఖ‌లేజా`. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఈ సినిమా పెద్ద‌గా ఆడ‌లేదు. అయితేఇప్పుడు మ‌ళ్లీ ఈ కాంబినేష‌న్ ని తెర‌పై చూసే అవ‌కాశం ఉంద‌ని టాక్ వినిపిస్తోంది. మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా కీర్తి సురేష్‌ని ఆల్రెడీ ఎంపిక చేసేశారు.


అయితే ఇందులో మ‌రో నాయిక కూడా ఉంద‌ని, ఆ ఛాన్స్ జేజ‌మ్మ‌కు ద‌క్కింద‌ని చెబుతున్నారు. నిజానికి ఈ సినిమాలో ఒకే ఒక్క హీరోయిన్ ఉంది. ఆ ప్లేస్ కీర్తికి ద‌క్కింది. మ‌రి అనుష్క ని ఎందుకు తీసుకున్న‌ట్టు?  అనే ప్రశ్న త‌లెత్తుతుంది. అనుష్క ఈ సినిమాలో హీరోయిన్ కాద‌ని, త‌న‌ని అతిథి పాత్ర‌లో తీసుకున్నార‌ని, ఆమెపై ఓ ప్ర‌త్యేక గీతాన్నీ తెర‌కెక్కిస్తారని ప్ర‌చారం మొద‌లైంది. అది నిజ‌మో కాదో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి. జ‌న‌వ‌రి నుంచి `స‌ర్కారు వారి పాట‌` రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కాబోతోంది. ఈలోగా.. అనుష్క విష‌యంలో క్లారిటీ వ‌స్తుందేమో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS