మొన్న సుకుమార్‌ ఇప్పుడు దేవిశ్రీ.!

మరిన్ని వార్తలు

కొత్తదనం కన్నా, సక్సెస్‌కే ఎక్కువ విలువిస్తుంటాడు సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు. ఆ మాటికొస్తే, అనుభవం కన్నా, సక్సెస్‌నే ఎక్కువగా నమ్ముతుంటాడు కూడా. అలా నమ్మిన ప్రతీసారీ మహేష్‌కి పోజిటివ్‌ రిజల్టే వచ్చింది. తాజాగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరిలేరు..' సక్సెస్‌నీ అలాగే పరిగణించాలి. సీనియర్‌ అండ్‌ బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ని కాదని వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న అనిల్‌ రావిపూడిని నమ్మి 'సరిలేరు..'కు అవకాశమిచ్చాడు. ఆ అవకాశాన్ని అనిల్‌ సద్వినియోగం చేసుకున్నాడనుకోండి.

 

ఇక ఇప్పుడు అలాంటి అవకాశాన్ని తమన్‌కిస్తున్నాడు మహేష్‌బాబు. తన 27వ చిత్రానికి సంగీత దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌బాబు తదుపరి సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా తమన్‌ పేరును అనౌన్స్‌ చేశాడు. అయితే, మహేష్‌ సినిమాలకు ఎక్కువగా దేవిశ్రీనే మ్యూజిక్‌ అందిస్తుంటాడు. కానీ, ఈ సారి సంక్రాంతికి విడుదలైన 'అల వైకుంఠపురములో..', 'సరిలేరు..' సినిమాల విషయానికి వస్తే, హీరోలతో పాటు, మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ మధ్య పోటీ కూడా గట్టిగా నెలకొంది.

 

ఆ పోటీలో, 'అల..'కు సంబంధించి తమన్‌, దేవిశ్రీ కన్నా ఎక్కువ మార్కులు కొట్టేశాడు. దాంతో, మహేష్‌ దృష్టి తమన్‌పై పడింది. మారు ఆలోచించకుండా, దేవిశ్రీని పక్కన పెట్టేసి, తమన్‌కి పగ్గాలప్పగించేశాడు. ఇప్పుడీ న్యూస్‌ టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఏది ఏమైతేనేం, ఓవర్‌ స్పీడులో వెళుతున్న తమన్‌ బండికి ఇప్పట్లో బ్రేకులు పడేలా కనిపించడం లేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS