ఓటీటీ వేదికలకు ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగింది. లాక్ డౌన్ సమయాన్ని బహు చక్కగా క్యాష్ చేసుకుని, ఈ సమయంలోనూ వ్యాపారం చేస్తోంది ఓటీటీ సంస్థలే. భవిష్యత్తులో వెబ్ సిరీస్లకూ, ఇండిపెండెంట్ సినిమాలకూ ఇంకా డిమాండ్ పెరగబోతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బడా స్టార్లు సైతం... ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇటీవలే.. అల్లు అరవింద్ నుంచి `ఆహా` మొదలైంది.
ఇప్పుడు మహేష్ బాబు సైతం ఓ ఓటీటీ సంస్థను స్థాపించడానికి ప్లాన్ చేస్తున్నట్టు వినికిడి. ఇప్పటికే ఓ బాలీవుడ్ సంస్థతో మహేష్ టై అప్ చేసుకున్నాడట. వాళ్లతో కలిసి సినిమాలు, వెబ్ సిరీస్లూ నిర్మించనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలన్నీ చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుపై ప్రాధమికంగా కనీసం 100 కోట్లు మహేష్ పెట్టుబడిగా పెట్టే అవకాశాలున్నాయి. మహేష్ నటించిన సినిమాలన్నీ ఇక మీదట ఈ ఓటీటీ కే కేటాయిస్తార్ట. మహేష్ ఉన్నాడంటే.. పబ్లిసిటీ పరంగా ఎలాంటి లోటూ ఉండదు. సో... ఆహా, అమేజాన్ లకు కొత్త పోటీదారుడు దొరికినట్టే.