మళ్లీ చిన్న డైరెక్టర్‌కే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సూపర్‌స్టార్‌.!

మరిన్ని వార్తలు

సూపర్‌ స్టార్‌ మహేష్‌ ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు. ఏ మాత్రం రిస్క్‌ లేకుండా హిట్‌ డైరెక్టర్స్‌తోనే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు కాబోలు. స్టార్‌ డైరెక్టర్స్‌ని సైతం సింపుల్‌గా పక్కన పెట్టేసి, హిట్‌ వస్తే చాలు, తక్కువ అనుభవం ఉన్న చిన్న డైరెక్టర్స్‌నే నమ్ముతున్నాడు. అసలు వివరాల్లోకి వెళితే, 'గీత గోవిందం' సినిమాతో బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ కొట్టిన పరశురామ్‌తో మహేష్‌ సినిమా ఓకే అయ్యిందని తాజా సమాచారం. 'గీత గోవిందం' హిట్‌ తర్వాత పరశురామ్‌తో సినిమాలు చేయడానికి స్టార్‌ హీరోలు క్యూ కట్టారని ప్రచారం జరిగింది. ఆ లిస్టులో అల్లు అర్జున్‌ కూడా ఉన్నాడు.

 

లేటెస్ట్‌ సమాచారం ప్రకారం, ఆ స్టార్‌ హీరోలంతా ఉత్తదే కానీ, మహేష్‌తో సినిమా ఓకే అరటే ఓకే.. అని డైరెక్ట్‌గా పరశురామ్‌ ఓ సందర్భంగా చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇటీవల పరశురామ్‌, మహేష్‌బాబుకి ఓ స్టోరీ లైన్‌ వినిపించాడట. ఆ స్టోరీ లైన్‌ మహేష్‌కి తెగ నచ్చేసిందట. తప్పకుండా చేద్దాం.. అని పరశురామ్‌కి చెప్పాడట. అంతేకాదు, 'సరిలేరు..' తర్వాతే ఈ సినిమా పట్టాలెక్కుతుందని అంటున్నారు. అయితే, పరశురామ్‌ ఇప్పటికే యంగ్‌ హీరో నాగ చైతన్యతో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పుడు చైతూ శేఖర్‌ కమ్ముల సినిమాతో బిజీగా ఉన్నాడు. మరి, 'సరిలేరు..' తర్వాత మహేష్‌ ప్రాజెక్ట్‌నే పరశురామ్‌ టేకప్‌ చేయనున్నాడా.? పూర్తి క్లారిటీ రావాలంటే మహేష్‌ నుండి అసలు రెస్పాన్స్‌ రావాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS