మ‌హేష్ కథ‌... ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు..??

మరిన్ని వార్తలు

బిజినెస్ మేన్ త‌ర‌వాత‌.. మ‌హేష్‌తో మ‌రో సినిమా చేయాల‌ని పూరి జ‌గ‌న్నాథ్ గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేశాడు. ఆ చిత్రానికి జ‌న‌గ‌ణ‌మ‌న అనే పేరు కూడా పెట్టేశాడు. కానీ అవేం ఫ‌లించ‌లేదు. సినిమా కి సంబంధించి, అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చిన త‌ర‌వాత కూడా ఆ సినిమా ఆగిపోయింది. ఆ టైమ్ లో పూరి బాగా డిస్ట్ర‌బ్ అయ్యాడు. మ‌హేష్‌పై నెగిటీవ్ గా కొన్ని ఆసక్తిక‌ర‌మైన కామెంట్లు కూడా చేశాడు. అవి విన్న ఎవ‌రికైనా స‌రే.. మ‌హేష్ - పూరి మ‌ధ్య సంబంధాల‌న్నీ తెగిపోయాయ‌న్న క్లారిటీ వ‌చ్చేస్తుంది. మ‌రి మ‌హేష్ కోసం రాసుకున్న క‌థ ఏమైన‌ట్టు..? ఆ సినిమా ఇక తీయ‌డా..?? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దొరికేసింది.

 

మ‌హేష్ కోసం రాసుకుని, ప‌క్క‌న పెట్టేసిన జ‌న‌గ‌ణ‌మ‌న క‌థ అవ‌స‌రం ఇప్పుడు పూరికి వ‌చ్చింది. ఇప్పుడు ఇదే క‌థ ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌బోతున్న‌ట్టు స‌మాచారం. ప‌వ‌న్ క‌ల్యాణ్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతోంద‌ని స‌మాచారం. మ‌హేష్ కోసం రెడీ చేసుకున్న క‌థ‌ని ఇప్పుడు ప‌వ‌న్‌కి వినిపించ‌బోతున్నాడ‌ట పూరి. జ‌గ‌న‌ణ‌మ‌న దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో న‌డిచే క‌థ‌. ఇలాంటి క‌థ‌ల వేట‌లోనే ఉన్నాడు ప‌వ‌న్‌. ఎందుకంటే ఇప్పుడు ప‌వ‌న్ రాజ‌కీయ శ‌క్తిగా ఎద‌గ‌బోతున్నాడు. ఇలాంటి స‌మ‌యంలో జ‌న‌గ‌ణ‌మ‌న లాంటి క‌థ‌లు త‌న రాజ‌కీయ ప్ర‌యాణానికి దోహ‌దం చేస్తాయ‌ని ప‌వ‌న్ భావిస్తున్నాడు. పూరి క‌థ న‌చ్చితే.. జ‌న‌గ‌ణ‌మ‌న ప‌ట్టాలెక్కేసిన‌ట్టే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS