మహేష్బాబులో ఓ మంచి బిజినెస్మేన్ ఉన్నాడు. తను ఖరీదైన బ్రాండ్ అంబాసిడర్. తన చిత్రాల నిర్మాణంలో భాగం పంచుకుంటున్నాడు. మల్టీప్లెక్స్లు నిర్మిస్తున్నాడు. దుస్తుల వ్యాపారంలోనూ అడుగుపెట్టాడు. త్వరలోనే పెర్ఫ్యూమ్నీ రంగంలోకి దింపుతున్నాడు. మహేష్ పేరు చాలు.. అది బ్రాండ్గా మారి లాభాలు వచ్చిపడిపోవడానికి.
అయితే తొలిసారి మహేష్ని నష్టాలు తప్పడం లేదు. అవును... కరోనా ఎఫ్టెక్ మహేష్ వ్యాపారంపై పడింది. హైదరాబాద్లోని ఏఎంబీ మల్టీప్లెక్స్ ని మూసేయడం వల్ల ఈ నెలలో మహేష్కి నష్టాలు తప్పడం లేదు. మల్టీప్లెక్స్ మూసేసినా, నిర్వహణ వ్యయం, సిబ్బందికి జీతాలు తప్పని ఖర్చులు. మళ్లీ సినిమా థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో చెప్పలేం. తెరచినా, జనాలు వస్తారని గ్యారెంటీ లేదు. నిజానికి గత రెండు మూడు నెలలుగా ఏఎంబీ మల్టీప్లెక్స్ నష్టాల్లోనే ఉందని సమాచారం. రాబోయే నెలల్లో అది మరింత పెరిగబోతోందన్నమాట. వ్యాపారం అంటేనే లాభ నష్టాలు కామన్. సూపర్ స్టార్ అయినా అందుకు అతీతుడు కాదు కదా?