నితిన్‌ ట్రాక్‌ మార్చేశాడా.!

మరిన్ని వార్తలు

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కి యంగ్‌ హీరో నితిన్‌ వీరభిమాని అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ మాటికొస్తే, నితిన్‌ పవన్‌ భక్తుడంతే. సినిమాలో ఏదో మూల పవన్‌ కళ్యాణ్‌ స్టైలో, మ్యానరిజమో ఏదో ఒకటి, లేదంటే పోస్టర్‌ అయినా ఉండేలా చూసుకుంటాడు. నితిన్‌ సినిమాల ఆడియో ఫంక్షన్స్‌కి పవన్‌ కళ్యాణ్‌ అతిధిగా విచ్చేస్తూ ఉంటాడు. 

అయితే ఈ సారి జస్ట్‌ ఫర్‌ ఏ ఛేంజ్‌. నితిన్‌ కోసం సూపర్‌ స్టార్‌ మహేష్‌ వస్తున్నాడు. సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు చేతుల మీదుగా నితిన్‌ తాజా చిత్రం 'శ్రీనివాస కళ్యాణం' ట్రైలర్‌ని విడుదల చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ ప్రకటించింది. దిల్‌ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. యంగ్‌ డైరెక్టర్‌ సతీష్‌ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ట్రైలర్‌ మహేష్‌ చేతుల మీదుగా విడుదలవుతుందంటూ, సోషల్‌ మీడియాలో నిర్మాణ సంస్థ ఇచ్చిన ప్రకటనకు సంబంధించిన హ్యాష్‌ ట్యాగ్‌ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉండడం విశేషం. అదీ మహేష్‌బాబు క్రేజ్‌ అంటే. 

మహేష్‌ ఏం చేసినా అంతే. ఈ సినిమాకి సంబంధించి ఇదే పెద్ద ప్రమోషన్‌ అయ్యింది. నితిన్‌కి ఈ మధ్య సరైన హిట్స్‌ లేక సతమతమవుతున్న సంగతి తెలిసిందే. అందుకే ఇలా ట్రాక్‌ ఛేంజ్‌ చేశాడేమో. పవర్‌ స్టార్‌ నుండి సూపర్‌స్టార్‌కి మారిపోయామేడో అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు. 

మరోవైపు సూపర్‌స్టార్‌ పేరు చెప్పి 'శ్రీనివాస కళ్యాణం' సినిమాకి క్రేజ్‌ మరింత పెరిగిపోయింది. ఏది ఏమైనా ఎలాగోలా నితిన్‌కి సక్సెస్‌ దక్కితే చాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS