షాకింగ్‌: మ‌హేష్ ఇలా క్కూడా డ‌బ్బులు లాగేసుకుంటాడా?

మరిన్ని వార్తలు

ద‌క్షిణాదిన అత్య‌ధిక పారితోషికం తీసుకునే క‌థానాయిక‌ల్లో మ‌హేష్ బాబు పేరు మొద‌టి వ‌రుస‌లో ఉంటుంది. పాతిక కోట్ల మైలు రాయిని తొలి సారి దాటిన హీరో మ‌హేషే. అంతే కాదు.. ఇప్పుడు కొత్త సినిమాకి గానూ... మొత్తం 50 కోట్ల వ‌ర‌కూ పారితోషికం అందుకుంటున్నాడ‌ట‌. ఇది టాలీవుడ్‌ని షేక్ చేసే వార్తే. మ‌హేష్ సినిమా హిట్ట‌యితే ఈజీగా వంద కోట్లు దాటేస్తోంది. అందుకే మ‌హేష్ కి అంత డిమాండ్‌.

 

అయితే పారితోషికంతో పాటు ఎగ‌స్ట్రా ఖ‌ర్చులు కూడా నిర్మాత‌లే భ‌రిస్తున్నార‌ని ఓ టాక్‌. షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో.. మ‌హేష్ అప్పుడ‌ప్పుడూ విదేశాల‌కు వెళ్లొస్తుంటాడు. ఆ డ‌బ్బులు కూడా నిర్మాత‌లే భ‌రించాల‌ని మ‌హేష్ ష‌ర‌తు విధిస్తున్నాడ‌ట‌. మ‌హ‌ర్షి సినిమా షూటింగ్ స‌మ‌యంలో మ‌హేష్ త‌న‌కుటుంబ స‌భ్యుల‌తో క‌ల‌సి యూర‌ప్ వెళ్లొచ్చాడు. ఆ బిల్లు,... మ‌హ‌ర్షి నిర్మాత‌ల‌తో వ‌సూలు చేయించాడ‌ట‌.

 

క్యార్ వేన్‌కీ, మేక‌ప్ అసిస్టెంట్ల‌కీ, త‌న మేనేజ‌ర్‌కీ, త‌న ప‌ర్స‌న‌ల్ స్టాప్‌కీ మొత్తం... నిర్మాత‌లే జీతాలు ఇచ్చుకోవాల‌ట‌. మొత్తానికి మ‌హేష్ నిర్మాత‌ల ద‌గ్గ‌ర నుంచి ర‌క‌ర‌కాల రూపాల‌లో డ‌బ్బులు వ‌సూలు చేస్తుంటాడ‌ని, ఆలెక్క‌లు కాగితాల‌పై వేసుకుంటే.. మ‌హేష్ పారితోషికంలో మ‌రో 10 శాతం పెరిగిన‌ట్టే అని చెబుతున్నారు. సూప‌ర్ స్టార్ తో సినిమా తీయాలంటే ఇవ‌న్నీ భ‌రించాల్సిందే మ‌రి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS