మహేష్‌ తనకిచ్చిన బిరుదును సార్ధకం చేస్తున్నాడా?

మరిన్ని వార్తలు

హౌస్‌లో అక్కడి మాటలు ఇక్కడా, ఇక్కడి మాటలు అక్కడా.. చెబుతూ అందరి మధ్యన పుల్లలు పెడుతున్నాడు.. అంటూ మహేష్‌కి నాగార్జున 'అగ్గిపుల్ల' అవార్డు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ అవార్డును సద్వినియోగం చేసుకుంటున్నట్లున్నాడు మహేష్‌. తాజా ఎపిసోడ్‌లో మహేష్‌ ప్రవర్తన చూస్తే నెటిజన్స్‌కి అలాంటి అభిప్రాయమే కలుగుతోంది. ఈ మధ్య వరుణ్‌, వితిక, రాహుల్‌, పునర్నవిలతో మహేష్‌ క్లోజ్‌గా ఉండడం చూస్తున్నాం. సడెన్‌గా ఏమైందో ఏమో తెలీదు కానీ, హౌస్‌లో ఇంకో గ్రూప్‌గా పిలవబడే శ్రీముఖి గ్రూప్‌తో మహేష్‌ ఆశక్తికరమైన డిస్కషన్‌ మొదలుపెట్టాడు. వరుణ్‌, వితిక, రాహుల్‌, పునర్నవిలు ఒక్కటేనని శ్రీముఖి వద్ద చెప్పుకొచ్చాడు.

 

ఈ మధ్య శ్రీముఖి వరుణ్‌ అండ్‌ గ్రూప్‌తో, ముఖ్యంగా వితికతో చాలా స్నేహంగా ఉంటోంది. ఒకవేళ అది చూసి ఓర్వలేక మహేష్‌, శ్రీముఖికి అలా చెప్పాడా? నీ ముందు బెస్ట్‌ ఫ్రెండ్స్‌లా ఉన్నట్లు బిహేవ్‌ చేస్తారు.. కానీ, నీ వెనక చాలా అసహ్యంగా మాట్లాడుకుంటారు వాళ్లు.. అంటూ ఆ నలుగురిపై నెగిటివ్‌గా చెప్పి, శ్రీముఖిలో ఒక రకమైన అభిప్రాయానికి బీజం వేశాడు మహేష్‌. వరుణ్‌ అండ్‌ గ్రూప్‌తో మంచిగా ఉంటూనే, అక్కడి మాటలు ఇక్కడ చెప్పడం ఎంతవరకూ సబబు మహేషా.? అంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు మహేష్‌ని గుమ్మెత్తిపోస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS