నాగార్జున నటిస్తున్న 'మన్మధుడు 2' చిత్రం ట్రైలర్ లేటెస్ట్గా విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన నాగార్జున ఇంట్రడక్షన్ టీజర్, హీరోయిన్ అవంతికా టీజర్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజా ట్రైలర్లో చాలానే ఎమోషన్స్ చూపించారు. నాగార్జున డైలాగులు, వెన్నెల కిషోర్ సపోర్టింగ్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఎలాగైనా నాగ్కి ఇంట్లో పెళ్లి చేయాలనుకుంటారు. కానీ, ఆయనకు పెళ్లిపై వేరే అభిప్రాయాలున్నట్లు ట్రైలర్ ద్వారా చూపించారు.
'ఒక్క పూట భోజనం కోసం వ్యవసాయం చేయను' అంటూ నాగ్, రకుల్తో చెప్పే డైలాగ్లో ఏదో పెద్ద అర్ధమే ఉన్నట్లు కనిపిస్తోంది. సినిమా చూస్తే కానీ అది తెలియదేమో. అయితే, వయసు ముదిరిపోతున్నా, పెళ్లి కాని మన్మధుడికి ఎలాగైనా పెళ్లి చేసేయాలన్న తపనతో ఉంటారు ఇంట్లో వాళ్లు. ఆ క్రమంలో పరిచయమైన రకుల్, ఆమెని నాగ్తో ముడి పెట్టేద్దామనుకునే బామ్మ లక్ష్మీ, ఏజ్ బార్ పెళ్లికొడుకుగా నాగ్పై రావు రమేష్ సెటైరికల్ డైలాగ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో ఫుల్ లెంగ్త్ హీరోయిన్గా రకుల్ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ బాగానే ఉందనిపిస్తోంది ఈ సినిమాలో.
సమంత, కీర్తిసురేష్ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. కానీ, వారికి సంబంధించి ఎలాంటి క్లూస్ ట్రైలర్లో రివీల్ చేయలేదు. ఎంటర్టైనింగ్ డైలాగులతో స్టార్ట్ అయిన ట్రైలర్ ఎండింగ్కొచ్చేసరికి అమ్మాయిలతో ముద్దులాటలు, సీరియస్ ఎమోషన్స్తో ముగిసింది. చివరిగా 'ఈడి కృష్ణావతారం ముగిసిపోయింది.. ఇక రామావతారమే.' అని వెన్నెల కిషోర్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. రాహుల్ రవీందన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మన్మధుడు 2' ఆగస్ట్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.