ప్రముఖ దర్శకుడిని 'బాంబు' తో బెదిరించిన ఆగంతకులు

మరిన్ని వార్తలు

ప్రముఖ నిర్మాత, లెజెండరీ దర్శకుడు అయిన మణిరత్నం కి నిన్నరాత్రి కొన్ని బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయట.

వివరాల్లోకి వెళితే, చెన్నై నగరంలోని అభిరామపురం లో గల మణిరత్నం ఆఫీస్ కి నిన్నరాత్రి గుర్తు తెలియని ఆగంతకులు ఫోన్ చేసి బెదిరించారట. ఆయన తాజాగా తీసిన చెక్క చివాంత వానం చిత్రంలోని కొన్ని సంబాషణలు తొలిగించాలని డిమాండ్ చేశారట.

అది కుదరని పక్షంలో ఆఫీస్ ని బాంబు పెట్టి పేల్చేస్తామని అలాగే మణిరత్నంకి కూడా హాని తలపెడతాము అని కొందరు వ్యక్తులు ఫోన్ లో బయపెట్టారట. ఈ తరుణంలో మణిరత్నం ఈరోజు ఉదయం సంబంధిత పోలీసు స్టేషన్ కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు.

వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఫోన్ కాల్ ఎవరు చేశారు అన్న దాని పైన ఆరా తీస్తున్నారు. ఇక తక్షణమే ఆయనకి ఆయన ఆఫీస్ కి పోలీసులు రక్షణ ఏర్పాటు చేశారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS