భారతీయ చిత్ర పరిశ్రమ లో దర్శకుడు మణిరత్నం అంటే తెలియని వారుండరు. ఆ మాటకొస్తే ఆయన చిత్రాలు చూసి ప్రేరణ పొంది ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు చాలామందే ఉన్నారు. ఎన్నో మేటి చిత్రాలు తీసి, పలు నేషనల్ అవార్డులు ఇంటర్నేషనల్ అవార్డులు అందుకున్నారు. అలాంటి మణిరత్నం ఇప్పుడు, నేటి తరం దర్శకుల్లో ఒకరికి వీరాభిమాని అయ్యాడు. అతనెవరో కాదు.. మలయాళం దర్శకుడు 'లిజో జోస్ పెల్లీసరి'. అంగమలై డైరీస్, జల్లికట్టు చిత్రాలతో అటు మలయాళం తో పాటు పర భాష ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ యువ దర్శకుడంటే మణిరత్నంకు అభిమానం అంట. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పారు.
లాక్ డౌన్ కారణంగా ఇళ్లకు పరిమితమైన సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో లైవ్ వీడియోలు పెట్టి ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకుంటున్నారు. మణిరత్నం మరియు తన భార్య సుహాసిని పెట్టిన లైవ్ లో 'లిజో జోస్' జాయిన్ అయ్యాడు.. అప్పుడు మణిరత్నం తనతో మాట్లాడుతూ.. తన సినిమాలంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చాడు.