ఒకే రోజు ముగ్గురు ‘మెగా’ అతిధులు.!

మరిన్ని వార్తలు

హైద్రాబాద్‌లో జరిగిన మూడు వేర్వేరు ఫంక్షన్స్‌కు మెగా కాంపౌండ్‌ నుండి ముగ్గురు హీరోలు ముఖ్య అతిధులుగా హాజరై సందడి చేశారు. ‘మెగాస్టార్‌ ` ది లెజెండ్‌’ బుక్‌ ఆవిష్కరణ వేడుకకు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ముఖ్య అతిథిగా విచ్చేయగా. చిన్న సినిమా ‘ఓ పిట్టకథ’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి మెగస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి, చిత్రయూనిట్‌కి తన ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా చిన్న సినిమాను ఆదరించాలనీ, సినిమాలకు సరిపడా ధియేటర్లు ఇవ్వా లని కోరారు.

 

మరోవైపు నితిన్‌ నటించిన ‘భీష్మ’ సూపర్‌ హిట్‌ కావడంతో, ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌కి మెగా రాకుమారుడు వరుణ్‌ తేజ్‌ గెస్ట్‌గా విచ్చేశాడు. నితిన్‌ని తనదైన శైలిలో పొగడ్తలతో ముంచెత్తేశాడు. బాబాయ్‌ పవన్‌ కళ్యాణ్‌కి నితిన్‌ పరమ వీర భక్తుడు.. నిజంగానే ఆ విషయంలో నితిన్‌ని అభినందించాలి. బాబాయ్‌ ఫ్యాన్స్‌ లిస్ట్‌లో నితిన్‌ నెంబర్‌ వన్‌ ప్లేస్‌లో ఉంటాడని వరుణ్‌ అభివర్ణించాడు. ఇలా ముగ్గురు మెగా హీరోలు సిటీలో ఆయా చోట్ల జరిగిన ఈవెంట్స్‌లో అతిధులుగా సందడి చేశారు.

 

ఇకపోతే, తండ్రి మెగాస్టార్‌ చిరంజీవి ‘మెగాస్టార్‌ ది లెజెండ్‌’ పుస్తకావిష్కరణలో చరణ్‌ డిఫరెంట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో కెమెరా కన్ను పక్కకి తిప్పుకోనీయకుండా ఎట్రాక్ట్‌ చేశాడు. వంపు తిరిగిన మీసకట్టుతో చాలా హుందాగా కనిపించాడు. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS