మెగాస్టార్‌ మెచ్చిన స్టోరీ.!

మరిన్ని వార్తలు

మెగా మేనల్లుడు 2గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న వైష్ణవ్‌ తేజ్‌ని ఇంట్రడ్యూస్‌ చేయడానికి మేనమామ మెగాస్టార్‌ చిరంజీవి చాలా ఆచితూచి వ్యవహరించారట. బుచ్చిబాబు చెప్పిన కథను మూడు, నాలుగు సార్లు విన్నారట. ఓ పక్క 'సైరా' సినిమాతో బిజీగా ఉంటూనే వైష్ణవ్‌ ఎంట్రీ మూవీ స్టోరీ విషయంలో చిరంజీవి చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. 'రంగస్థలం' కథ విన్నప్పుడు ఎలా అయితే ఫీల్‌ అయ్యారో అలాగే బుచ్చిబాబు వైష్ణవ్‌ కోసం చెప్పిన కథ విన్నప్పుడు కూడా అలాగే ఫీలయ్యారట చిరంజీవి. ఈ స్టోరీ అంతగా చిరంజీవికి నచ్చేసిందట. 

 

లుక్స్‌ పరంగా కూడా వైష్ణవ్‌ 'రంగస్థలం'లోని చిట్టిబాబును తలపిస్తున్నాడు. భుజంపై చేపల వలను వేసుకుని లుంగీ ఎగ్గట్టి వెనక నుండి కనిపిస్తున్న వైష్ణవ్‌ ఫస్ట్‌లుక్‌ చూస్తుంటే, భుజాన కావిడి మోస్తూ లుంగీతో గెడ్డంతో రంగస్థలంలో చరణ్‌ ఫస్ట్‌లుక్‌లానే ఉంది. అంతేకాదు, ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం కూడా గట్టిగానే కసరత్తులు చేశారట. ఏకంగా 16 మంది అమ్మాయిల్ని హీరోయిన్‌ పాత్ర కోసం టెస్ట్‌ షూట్‌ చేశారట. 

 

అచ్చమైన తెలుగమ్మాయినే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంచుకోవాలనుకున్నారట. అలా చాలా చాలా కష్టపడి హీరోయిన్‌గా అసలు సిసలు తెలుగమ్మాయి మనీషారాజ్‌ని ఎంచుకోవడం జరిగిందని ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామ్యం వహిస్తున్న సుకుమార్‌ తెలిపారు. ఏది ఏమైనా ఫస్ట్‌లుక్‌తోనే భారీ హైప్‌తో పాటు, భారీ అంచనాలు కూడా నమోదు చేస్తున్న ఈ సినిమాతో మైత్రీ మూవీస్‌ సంస్థ 'రంగస్థలం' వంటి మరో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయమనిపిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS