మెగా కాంపౌండ్‌ని టచ్‌ చేసిన పోరీ.!

మరిన్ని వార్తలు

'లై' సినిమాతో తెరంగేట్రం చేసిన బ్యూటీ మేఘా ఆకాష్‌. పరిచయానికి ముందే ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేసింది ఈ భామ. అయితే అంచనాలతో తెరకెక్కిన 'లై' సినిమా నిరాశ పరిచింది. అయినా కానీ ఈ బ్యూటీకి క్రేజ్‌ తగ్గలేదు. బ్యాక్‌ టు బ్యాక్‌ నితిన్‌ సినిమాలతోనే అమ్మడు రేస్‌లో కొనసాగుతోంది. 

'లై' తర్వాత మేఘా ఆకాష్‌ నటిస్తోన్న చిత్రం 'ఛల్‌ మోహన్‌రంగ'. పవన్‌ కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌లో రూపొందుతోన్న ఈ సినిమాని కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ లోగా అమ్మడు మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు లైన్‌లో పెట్టేస్తోందండోయ్‌. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది మెగా మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్‌ సినిమా. రామ్‌తో 'నేను శైలజ', 'ఉన్నది ఒక్కటే జిందగీ' వంటి చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్‌ కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో మెగా మేనల్లుడు ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ చిత్రానికే మేఘా ఆకాష్‌ని హీరోయిన్‌గా ఎంచుకున్నారనీ ప్రచారం జరుగుతోంది. 

అదే నిజమైతే అమ్మడు మెగా కాంపౌండ్‌లోకి అడుగు పెట్టేసినట్లే. అంతకన్నా ముందు త్వరలో రానున్న 'ఛల్‌ మోహన్‌రంగ' సినిమాతో కానీ ఈ బ్యూటీ హిట్‌ కొట్టిందంటే అమ్మడి దశ తిరిగిపోయినట్లే. ఏమో ఏం చేస్తుందో తెలీదు కానీ, కూల్‌ అండ్‌ లవ్‌లీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన 'ఛల్‌ మోహన్‌రంగ' సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. త్రివిక్రమ్‌ కథనందించిన ఈ సినిమా ప్రచార చిత్రాలను బట్టి చూస్తే, త్రివిక్రమ్‌ పెన్ను మ్యాజిక్‌ ఇటు మేఘా ఆకాష్‌కీ, అటు నితిన్‌కీ కూడా కలిసొచ్చేలానే అనిపిస్తోంది. 

అంతేకాదండోయ్‌ ఇదే కాదు, ఈ బ్యూటీ టాలీవుడ్‌లో బిగ్‌ ఫ్యామిలీ నుండి వచ్చిన మరో యంగ్‌ హీరో సినిమాలో కూడా ఛాన్స్‌ కొట్టేసిందనీ సమాచారమ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS