మెహరీన్‌ ఆవేదన విన్నారా?

మరిన్ని వార్తలు

అందాల నటి మెహరీన్‌ ఈ మధ్య అమెరికా వెళ్లింది. అక్కడి పోలీసులు సెక్స్‌ రాకెట్‌ విషయమై మెహరీన్‌ని ప్రశ్నలతో వేధించారనీ, దాంతో మెహరీన్‌ చాలా ఆవేదనకు గురైందనీ, షాక్‌లోకి వెళ్లిపోయిందనీ ప్రచారం జరిగింది. అయితే మెహరీన్‌ అమెరికా వెళ్లడం నిజమే. అక్కడి పోలీసులు ఆమెను ప్రశ్నించడం నిజమే. 

కానీ ఆమె ఇబ్బంది పడేలా పోలీసుల ప్రవర్తన లేదనీ, తాను తన ఫ్యామిలీని కలుసుకునేందుకు వచ్చానని చెప్పడంతో పోలీసులు సారీ చెప్పి విడిచిపెట్టారనీ మెహరీన్‌ చెప్పుకొచ్చింది. తనపై ప్రచారమవుతున్న ఈ అనవసర గాసిప్స్‌ పట్టించుకోవద్దనీ అభిమానులకు చెబుతోంది మెహరీన్‌. అంతేకాదు ఈ గొడవ ఇంతటితో ఆగలేదు. సెక్స్‌ రాకెట్‌ విషయంలో మెహరీన్‌ ఎదుర్కొన్న ఇబ్బంది కారణంగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందనీ, ఆ కారణంగానే 'పంతం' సినిమా ప్రమోషన్స్‌కి మెహరీన్‌ రాలేకపోతోందనీ కొత్తగా ప్రచారం జరుగుతోంది. 

దీన్ని కూడా మెహరీన్‌ ఖండించింది. వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్న కారణంగా 'పంతం' ప్రమోషన్స్‌కి హాజరు కాలేకపోయానని మెహరీన్‌ చెప్పింది. అయినా ఈ విషయాన్ని ముందుగానే సోషల్‌ మీడియాలో పేర్కొన్నాననీ మెహరీన్‌ గుర్తు చేసింది. ఫీవర్‌ తగ్గగానే ప్రమోషన్స్‌లో పాల్గొంటానని మెహరీన్‌ చెప్పుకొచ్చింది. 

ఇకపోతే 'పంతం' సినిమాతో పాటు 'ఎఫ్‌ 2' సినిమాలోనూ మెహరీన్‌ నటిస్తోంది. మెగా ప్రిన్స్‌ - వరుణ్‌ తేజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మెహరీన్‌తో పాటు, మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నటిస్తోంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS