మిల్కీ బ్యూటీ మొత్తం మారిపోయింది

మరిన్ని వార్తలు

గత పదమూడేళ్లుగా తన అందంతో టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా. మొదట్లో ఎక్కువగా గ్లామర్‌ పాత్రలనే ఎంచుకుంటూ వచ్చింది. అలా కమర్షియల్‌ హీరోయిన్‌గా నిలదొక్కుకుంది. ఇప్పుడిక గ్లామర్‌ పాత్రలు బోర్‌ కొట్టేశాయంట తమన్నాకి. అందుకే పూర్తి స్థాయి పాత్రలు కాకపోయినా, విభిన్నమైన పాత్రలను ఎంచుకునే దిశగా ఆలోచన చేస్తోందట. అందులో భాగంగానే ఆల్రెడీ రెండు సినిమాల్లో స్పెషల్‌ రోల్స్‌కి ఓకే చేసేసింది.

అందులో ఒకటి నాగచైతన్య హీరోగా నటిస్తున్న 'సవ్యసాచి' చిత్రంలో ఓ గెస్ట్‌ రోల్‌లో తమన్నా కనిపిస్తోంది. పాత్ర నిడివి చాలా తక్కువ ఉన్నా, రిజిస్టర్డ్‌ క్యారెక్టర్‌ అవుతుందట అది సినిమాకి. ఇకపోతే ప్రతిష్ఠాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'లోనూ తమన్నా ఓ ఇంపార్టెంట్‌ రోల్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తన పాత్ర ఎలాంటిది అని ఆలోచించకుండా అవకాశం రాగానే వెంటనే ఓకే చేసేసిందట తమన్నా. అయితే ఈ సినిమాలో తనకు దక్కిన పాత్ర తనకెంతో ఇష్టమైంది. ఛాలెంజింగ్‌ రోల్‌ అంటోంది.

ఇలా ఇవే కాదు, ఇకపై తన నుండి కొత్త కొత్త క్యారెక్టర్స్‌ని ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చని ఫ్యాన్స్‌కి భరోసా ఇస్తోంది తమన్నా. ఇకపోతే తమన్నా హీరోయిన్‌గా నటించిన 'నా నువ్వే' చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. కళ్యాణ్‌రామ్‌తో తమన్నా తొలిసారిగా జత కడుతోన్న సినిమా ఇది. జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తమన్నా చాలా ఫ్రెష్‌గా, కొత్తగా అందంగా కనిపిస్తోంది. ఈ సినిమాకి తమన్నా తన సొంత గొంతు వినిపించింది కూడా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS