'మీ టూ'పై మిల్కీబ్యూటీ హాట్‌ కామెంట్‌.!

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ నటి తనూశ్రీదత్తా స్టార్ట్‌ చేసిన 'మీ టూ' మూమెంట్‌ సినీ పరిశ్రమని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలా మంది 'మీ టూ'పై తమ తమ అభిప్రాయాల్ని తెలియచెప్పేందుకు ముందుకొచ్చారు. 'మీ టూ' బాధితులు కొందరు పలువురు సినీ ప్రముఖులపై ఆరోపణలు కూడా చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మిల్కీబ్యూటీ తమన్నా ఓ బాలీవుడ్‌ ఇంటర్వ్యూలో మీటూపై స్పందించింది. 

 

'ఏ ఒక్కరూ ఎవ్వర్నీ ముద్దు సీన్లలో నటించాలనీ, రొమాంటిక్‌ సీన్లలో విచ్చలవిడితనం ప్రదర్శించాలనీ బలవంతపెట్టరు. మనకు నచ్చితే ఆ సీన్లలో నటించాలి. లేదంటే కామ్‌గా తప్పుకోవాలి అంతే.. నేను కెరీర్‌ స్టార్ట్‌ చేసిన కొత్తల్లోనే ముద్దు సీన్లలో నటించనని ఖచ్చితంగా చెప్పేశాను. సో 'మీ టూ'పై తనకి ఓ క్లారిటీ ఉంది..' అని తమన్నా చెప్పుకొచ్చింది. తమన్నా ప్రస్తుతం తెలుగులో ఫుల్‌ బిజీగా గడుపుతోంది. 

 

హిందీలోనూ కొన్ని సినిమాల్లో నటించింది. కానీ అంతగా సక్సెస్‌ కాలేదు ఆ సినిమాలు. మంచి అవకాశాలు వస్తే మళ్లీ హిందీలో నటించేందుకు తమన్నా సిద్ధంగా ఉన్నానని చెబుతోంది. తెలుగులో ప్రతిష్ఠాత్మక చిత్రాల్లో తమన్నా నటిస్తోంది. ఈ ఏడాది 'ఎఫ్‌ 2'తో తమన్నా బిగ్గెస్ట్‌ హిట్‌ అందుకుంది. త్వరలో 'దటీజ్‌ మహాలక్ష్మి'తో రాబోతోంది. తమన్నా నటించిన సస్పెన్స్‌ హారర్‌ మూవీ 'అభినేత్రి 2' ఏప్రిల్‌లో ప్రేక్షకులు ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS