నటుడు, నిర్మాత మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. నిన్న రాత్రి మోహన్ బాబు ఇంట్లో లక్షలు విలువైన నగలు మాయం అయినట్టు సమాచారం అందుతోంది. ఈ మేరకు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైనట్టు సమాచారం. మోహన్ బాబు పర్సనల్ మేనేజర్ చంటి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మోహన్ బాబు ఇంట్లో పనిచేసే వ్యక్తిపైనే అనుమానాలు ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే.. తాజాగా మరో మాట కూడా వినిపిస్తోంది. మోహన్ బాబు దగ్గర పనిచేసే ఓ వ్యక్తి... మోహన్ బాబు దగ్గర లక్షల రూపాయల్ని అప్పుగా తీసుకున్నాడని, అడిగితే... చెల్లించడం లేదని, అందుకే అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారని సమాచారం. ఈ కేసు దొంగతనానికి సంబంధించిందా? లేదా అప్పు ఎగవేతకు సంబంధించిందా? అనేది ఆసక్తికరంగా మారింది.