మోహన్ బాబు గాయత్రి టీజర్ టాక్

మరిన్ని వార్తలు

మంచు మోహన్ బాబు ఇటీవలే తన సినీ జీవితంలో 42 ఏండ్లు పూర్తి చేసుకున్నారు. ఇక తాజాగా ఆయన చేస్తున్న చిత్రం గాయత్రి, దీని తాలుకా టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. ఈ టీజర్ లో మోహన్ బాబు తనకి మాత్రమే సాధ్యమైన వైవాధ్యభరితమైన డైలాగ్ డెలివరీ తో ప్రేక్షకులని అలరించాదు అనే చెప్పాలి.

టీజర్ మొదలవుతూనే- రామాయణంలో రాముడుకి రావణాసురుడికి గొడవ.. మహాభారతంలో పాండవులకి, కౌరవులకి మాత్రమే గొడవ... వాళ్ళు వాళ్ళు కొట్టుకొని ఎవరో ఒకరు చనిపోయి ఉంటే బాగుండేది...

కాని వాళ్ళ మూలంగా జరిగిన యుద్ధంలో అటు ఇటు కొన్ని లక్షల మంది సైనికులు చనిపోయారు... 

పూరాణాల్లో వాళ్ళు చేసింది తప్పయితే... ఇక్కడ నేను చేసింది కూడా తప్పే...

అక్కడ వాళ్ళు దేవుళ్ళు అయితే...  ఇక్కడ నేను దేవుడినే...

అర్ధం చేసుకుంటారో... అపార్ధం చేసుకుంటారో... ఛాయస్ ఈజ్ యువర్స్
అంటూ ముగించేశాడు ఈ డైలాగ్ కింగ్...

ఈ మాత్రం డైలాగులు చాలవు సినిమా కోసం ప్రేక్షకుడు ఎదురు చూడడానికి అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. దర్శకుడు మదన్ కచ్చితంగా మోహన్ బాబుని ఒక కొత్త తరహాలో చూపెట్టినట్టుగా తెలుస్తున్నది.

ఇక ఈ చిత్రంలో మోహన్ బాబు తో పాటు శ్రియా, విష్ణు, నిఖిలా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS