పసుపులేటి రామారావు మరణం పై మోహన్ బాబు దిగ్భ్రాంతి.!

మరిన్ని వార్తలు

"నాకు సన్నిహితుడైన సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు గారి మరణం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. నేను నటుడిగా పరిచయమైనప్పటుంచీ ఆయనతో నాకు స్నేహం ఉంది. మద్రాసులో ఎంత సన్నిహితంగా ఉన్నామో, హైదరాబాద్ కు వచ్చాక కూడా అదే సానిహిత్యం మా మధ్య కొనసాగింది. అప్పుడూ, ఇప్పుడూ తెల్లటి దుస్తులు, భుజాన కాటన్ సంచీ.. ఇదే ఆయన ఆహార్యం. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా ఆయన పేరు తెచ్చుకున్నారు.

ఎన్నోసార్లు ఆయన నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూల్లో తనకు కావాల్సిన ఎన్నో విషయాలు రాబట్టుకొనేవారు. సినిమా జర్నలిస్టుగా చిత్రసీమకు ఆయనెంతో సేవచేశారు. ఒక తరం సినీ జర్నలిస్టులకు మార్గదర్శిగా నిలిచిన ఆయన మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను."


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS