దేవసేనతో భళ్లాలదేవ ఢీ అంటే ఢీ!

మరిన్ని వార్తలు

‘బాహుబలి’లో పోటా పోటీగా ఆపోజిట్‌ రోల్స్‌ పోషించిన రానా, అనుష్కలు ఈ సారి బాక్సాఫీస్‌ వద్ద పోరుకు సిద్ధపడుతున్నారు. ‘బాహుబలి’ తర్వాత అనుష్క నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్ధం’. బహుభాషా చిత్రంగా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. హేమంత్‌ మధుకర్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, మాధవన్‌ హీరోగా నటిస్తున్నారు. అంజలి, షాలినీ పాండే ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇదే రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు భళ్లాల దేవ రానా కూడా రెడీ అయిపోతున్నాడు ‘అరణ్య’ సినిమాతో. ఈ సినిమా కూడా బహుభాషా చిత్రంగానే రూపొందుతోంది.

 

హిందీలో ‘హాథీ మేరీ సాథీ’గా, తమిళంలో ‘కాదన్‌’ టైటిల్స్‌తో విడుదవుతోంది. ఈ రెండు సినిమాల్లోనూ రానా, అనుష్కలు డిఫరెంట్‌ రోల్స్‌తో ఆకట్టుకుంటున్నారు. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత అనుష్క నుండి వస్తున్న చిత్రం కావడంతో ‘నిశ్శబ్ధం’ సినిమాపై భారీ అంచనాలు న్నాయి. సైంటిఫిక్‌ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో అనుష్క మ్యూట్‌ ఆర్టిస్ట్‌ సాక్షి పాత్రలో కనిపించనుంది. ఇక రానా సినిమా విషయానికి వస్తే, ఫారెస్ట్‌, ఏనుగు తదితర ఆసక్తికరమైన అంశాల తో రూపొందిన చిత్రమే ‘హాథీ మేరీ సాధీ’. ప్రభు సాల్మన్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అనూహ్యంగా ఒకే రోజు బాక్సాఫీస్‌ వద్ద తలపడుతున్న ఈ రెండు సినిమాల్లో గెలుపెవరిదో తెలియాలంటే ఏప్రిల్‌ 2 వరకూ వేచి చూడాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS