ఫ్యామిలీ డ్రామా అంటున్న మోహన్ బాబు

మరిన్ని వార్తలు

వెటరన్ హీరోలలో ఒకరైన మోహన్ బాబు ఈ మధ్య చాలా తక్కువగా సినిమాలు చేస్తున్నారు. 'గాయత్రి' తర్వాత తెలుగులో మరో సినిమాలో నటించలేదు. అయితే తమిళ హీరో సూర్య నటిస్తున్న 'సూరరై పొట్రు'(ఆకాశం నీ హద్దురా) సినిమాలో ఒక కీలక పాత్ర పోషించారు. వేసవిలోనే ఈ సినిమా విడుదల కావలసి ఉన్నప్పటికీ వాయిదా పడింది.

 

ఇదిలా ఉంటే 'పెదరాయుడు' సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మోహన్ బాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. తనకు తెలుగు దర్శకులు ఆఫర్లు ఇస్తూనే ఉన్నారని, అయితే వాటిని యాక్సెప్ట్ చెయ్యలేదన్నారు. త్వరలోనే 'పెదరాయుడు' తరహాలో ఒక ఫ్యామిలీ డ్రామాలో నటించబోతున్నానని చెప్పారు. ఈ సినిమా స్క్రిప్ట్ కూడా రెడీ అయిందని, భారీ తారాగణంతో ఈ సినిమాను లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తానని తెలిపారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలు వెల్లడిస్తామని అన్నారు.

 

మరి ఈ సినిమాలో మంచు హీరోలే నటిస్తారా లేదా ఇతర హీరోలు కూడా నటిస్తారా అనేది తెలియదు. ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారనేది కూడా ముఖ్యమే. ఈ జెనరేషన్ ప్రేక్షకులకు తగ్గట్టుగా ఫ్యామిలీ డ్రామాతో మెప్పించడం కత్తిమీద సామేనని చెప్పాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS