'అదుగో' అందుకూ సై అంటోన్న ముద్దుగుమ్మ.!

మరిన్ని వార్తలు

కన్నడ బ్యూటీ నభా నటేష్‌ తెలుగులో ఏకకాలంలో రెండు సినిమాలతో తెరంగేట్రం చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ తెలుగులో నటించిన తొలి సినిమా రవిబాబు దర్శకత్వం వహించిన 'అదుగో' అయినా, ముందుగా విడుదలయ్యేది మాత్రం 'నన్ను దోచుకుందువటే'. సుధీర్‌బాబు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తోంది. 

నటిగా మంచి గుర్తింపు తెచ్చుకునే పాత్రలను ఎంచుకోవాలినుకుంటోందట. అలాగనీ ఎక్స్‌పోజింగ్‌లో అస్సలు అభ్యంతరాల్లేవంటోంది. కథకి అవసరమైతే గ్లామర్‌ ప్రదర్శించడానికీ తాను సిద్ధమే అంటోంది. 'నన్ను దోచుకుందువటే' ప్రచార చిత్రాల్లో ఈ ముద్దుగుమ్మ బాగానే ఎట్రాక్ట్‌ చేస్తోంది. సిరి పాత్రలో యాక్టివ్‌గా అల్లరి పిల్లలా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. ఈ ముద్దుగుమ్మ ఎంచుకున్న రెండు చిత్రాల కథలు పూర్తిగా విభిన్నం. అది చూస్తేనే అర్ధమైపోతోంది. 

ఈ బ్యూటీ కథల ఎంపికలో అప్పుడే ఎంత అనుభవం ఉన్నదానిలా వ్యవహరిస్తుందో. మరో రెండు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయట. త్వరలోనే వాటి వివరాలు ప్రకటిస్తానంటోంది. 'నన్ను దోచుకుందువటే' చిత్రం సక్సెస్‌ అయితే ఈ ముద్దుగుమ్మ కెరీర్‌కి ఏమాత్రం ఢోకా ఉండదనే చెప్పాలి. తర్వాత దసరా బరిలో ఉన్న రవిబాబు 'అదుగో'తో కెరీర్‌లో మరో స్టెప్‌ ముందుకెళ్లేలా చేస్తుంది. అలాగే ఈ ముద్దుగుమ్మకి చిన్నతనం నుండీ ఓ అలవాటుందట. 

ఇతర భాషలపై పట్టు సాధించడం అంటే ఎంతో ఇష్టమట. అలా తెలుగు భాషపై అప్పుడు మమకారం పెంచేసుకుంది. తెలుగులో చిన్న చిన్న పదాలు మాట్లాడడం నేర్చుకుంటోందట. త్వరలోనే పూర్తి స్థాయిలో తెలుగులో మాట్లాడేస్తానంటోంది అందాల నభా నటేష్‌.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS