సినిమా ఎండింగ్లో శుభం కార్డు సరదాగా ఉంటేనే మన తెలుగు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారు. విషాదాంతమైన శుభం కార్డుల్ని తమిళ తంబీలు యాక్సెప్ట్ చేసినట్లుగా తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. అందుకే ఒకవేళ రీమేక్ సినిమాల్ని టేకప్ చేసినా, తెలుగు వెర్షన్కొచ్చేసరికి శాడ్ క్లైమాక్స్ ఉంటే, వాటికి రంగులద్దేస్తుంటారు మన దర్శకులు. కానీ, టాలెంటెడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సారి ఓ ప్రయోగం చేయబోతున్నాడట. ఆయన తెరకెక్కినస్తున్న 'లవ్స్టోరీ'లో శాడ్ క్లైమాక్స్ ఉండబోతోందనే న్యూస్ తాజాగా హల్చల్ చేస్తోంది. నాగచైతన్య - సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్స్టోరీ' అనే మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా క్లైమాక్స్లో హీరో పాత్ర చనిపోతుందనేది ఈ తాజా వైరల్ న్యూస్. హీరో జ్ఞాపకాలను మోస్తూ జీవనం సాగించే బరువైన హీరోయిన్ పాత్రలో సాయి పల్లవి కనిపించబోతోందట. ఓకే సాయి పల్లవి విషయంలో ఈ పాత్ర చిత్రీకరణను అంగీకరించొచ్చు. ఎందుకంటే, ఆమె యాక్టింగ్ టాలెంట్ చాలా సార్లు చూసేశాం. సో ఎంత బరువైన పాత్రయినా సాయి పల్లవికి అరటి పండు ఒలిచినంత ఈజీనే. తన పాత్రలోకి ఆడియన్స్ని అలా కనెక్ట్ చేసేస్తుంది కూడా. అరతా బాగానే ఉంది కానీ, ఈ శాడ్ క్లైమాక్స్ని భరించడం ఆడియన్స్ వల్లవుతుందా.? హృద్యమైన 'లవ్స్టోరీ'కి ఈ శుభం కార్డు సరైనదేనా.? అసలింతకీ ఈ న్యూస్ నిజమేనా.? తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.