చైతు - సాయి పల్లవి స్పీడ్ గా పూర్తి చేసేస్తున్నారుగా !

By iQlikMovies - December 03, 2019 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

బలమైన స్టోరీస్ తో  సెన్సిబుల్ దర్శకుడిగా శేఖర్ కమ్ములకు మంచి  నేమ్  ఉంది. దానికి తోడు  మజిలీ లాంటి సూపర్ హిట్ తో మంచి ఫామ్ లో ఉన్న నాగచైతన్యను  హీరోగా.. తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవిను  హీరోయిన్ గా పెట్టి  క్రేజీ కాంబినేషన్ తో సినిమా చేస్తున్నాడు.  కాగా ఇటీవలే ఈ సినిమా  నాలుగో షెడ్యూల్  మొదలు అయిన సంగతి తెలిసిందే.

 

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం నాలుగో షెడ్యూల్ పూర్తి అయినట్లు తెలుస్తోంది.  మొత్తానికి షూటింగ్ ను చాల వేగంగా  పూర్తి చేస్తున్నారట. ముఖ్యంగా చై అండ్ సాయి పల్లవి టైం వెస్ట్ చెయ్యకుండా  చాల స్పీడ్ గా షూట్ చేస్తున్నారట.   ఇక తరువాత షెడ్యూల్ చిత్రబృందం రెడీ అవుతుంది.  ఇక డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. ఏషియన్ వంటి పెద్ద కంపెనీ నిర్మిస్తుండటం వల్ల ఇప్పుడీ ప్రాజెక్ట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.  

 


దీంతో పాటు శేఖర్ కమ్ముల ఎంచుకున్న కాస్ట్ కూడా ప్రాజెక్ట్ కు పెద్ద ఎస్సెట్ అయింది.  ఇప్పటికే చాల భాగం  షూట్  పూర్తి చేసుకున్న  ఈ సినిమా   ఫిబ్రవరిలో  విడుదల కానుంది. ఇక  కథ విపరీతంగా నచ్చడంతో హీరో హీరోయిన్లిద్దరూ బల్క్ డేట్స్ కేటాయించారు. మొత్తంగా ఈ సినిమా ఆన్ స్క్రీన్ నుంచి ఆఫ్ స్క్రీన్ వరకూ అంతా సెన్సేషనల్ పీపులే ఉండటంతో ఇండస్ట్రీలో ఈ అనౌన్స్ మెంట్ ఆసక్తిని పెంచింది.  ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే శేఖర్ కమ్ముల ఫిదా తర్వాత చేస్తోన్న  ఈ సినిమా  మరి తెలుగు ప్రేక్షకులను మళ్లీ ఫిదా చేస్తుందా..? లేదా..? అనేది చూడాలి.     


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS