మియామీలో లవ్‌ బర్డ్స్‌ రొమాన్స్‌

మరిన్ని వార్తలు

ప్రేమించి పెళ్లి చేసుకున్న అందమైన జంట సమంత, నాగచైతన్యలు ప్రస్తుతం విహార యాత్రలో ఉన్నారు. తాము చేస్తున్న సినిమా షూటింగ్స్‌ నుండి కాస్త గ్యాప్‌ తీసుకుని, ఇద్దరూ అలా సరదాగా విదేశాల్లో ఎంజాయ్‌ చేసేందుకు వెళ్లారు. అందులో భాగంగా అమెరికాలోని మియామీలో ఈ జంట సందడి చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో సమంత పోస్ట్‌ చేసింది. 

మియామీలోని ఔట్‌ డోర్‌ ఆర్ట్‌ మ్యూజియంలో చై - శామ్‌ రొమాంటిక్‌గా దిగిన ఫోటోలను పోస్ట్‌ చేసింది. ప్రపంచంలోని అత్యుత్తమమైన కళాకారులచే వేయబడిని చిత్రాలను ప్రదర్శించే విన్‌వుడ్‌ వాల్స్‌ మ్యూజియంలో ఈ జంట ఆనందంగా గడిపారు. ఇకపోతే సమంత ఇటీవలే 'రంగస్థలం' సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని, రిలీజ్‌ కోసం ఎదురు చూస్తోంది. సమంతకి కెరీర్‌లోనే 'రంగస్థలం' ఓ కొత్త అనుభూతినిచ్చే చిత్రంగా పరిగణించొచ్చు. అలాగే చైతూ కూడా 'సవ్యసాచి' చిత్రాన్ని ప్రెస్టీజియస్‌ మూవీగా భావిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ తమ కెరీర్స్‌లో బిజీగా గడుపుతున్నారు.

'సవ్యసాచి'తో పాటు 'శైలజా రెడ్డి అల్లుడు' చిత్రంలో చైతూ నటిస్తున్నాడు. మరో పక్క సమంత చేతిలో చాలా చిత్రాలున్నాయి. తెలుగు, తమిళంలో కూడా బిజీగా సినిమాలు చేస్తోంది సమంత. ఆమె కీలక పాత్రలో నటిస్తున్న 'మహానటి' చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాక తమిళంలో పలు చిత్రాలతో పాటు, 'యూ టర్న్‌' అనే థ్రిల్లర్‌ మూవీలో సమంత నటిస్తోంది. 

అన్నట్లు పెళ్లి తర్వాత ఈ జంట తొలిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోయే రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ కూడా త్వరలోనే పట్టాలెక్కనుంది. శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS