ఇప్పటికే చాలా మంది హీరోలు, హీరోయిన్లు నటనతో పాటు, నిర్మాణం పైనా ఆసక్తి చూపుతున్నారు. మంచి సినిమాలను రూపొందిస్తూ, నిర్మాణ రంగంలోను తమ తమ అభిరుచిని చాటుకుంటున్నారు. ఇప్పుడు ఈ రంగంలోకి టాలీవుడ్ క్రేజీ పెయిర్ శామ్, చై కూడా చేరినట్లు తెలుస్తోంది. నాగచైతన్య, సమంత కలిసి కొత్తగా ఓ నిర్మాణ సంస్థను స్టార్ట్ చేయబోతున్నారట. దానికి సంబంధించిన ఇన్ఫమేషన్ తాజాగా ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
తాజాగా ఏఎన్ఎస్ పిక్చర్స్ పేరుతో ఈ జంట ఓ బ్యానర్ని రిజిస్ట్రర్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీలో అన్నపూర్ణ స్టూడియోస్తో కలిపి మరో మూడు నాుగు చిన్న నిర్మాణ సంస్థలు కూడా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆయా బ్యానర్స్లో పలు చిత్రాలు రూపొందుతున్నాయి. తాజాగా సమంత ` చైతూ స్టార్ట్ చేసిన ఈ నిర్మాణ సంస్థలో త్వరలోనే ఓ సినిమా రూపొందనుందని తెలుస్తోంది.
సదరు నిర్మాణ సంస్థ ద్వారా ఓ కొత్త దర్శకున్ని ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నారట. త్వరలోనే ఆ వివరాలు వెల్లడి కానున్నాయి. ఇకపోతే, ప్రస్తుతం చైతూ ‘లవ్ స్టోరీ’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇటీవల ‘జాను’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సమంత త్వరలో ‘ఫ్యామిలీ మేన్ 2’ అనే వెబ్ సిరీస్తో డిజిటల్ ప్లాట్ఫామ్లో సందడి చేయనుంది. నటిగా స్టార్ ఇమేజ్ దక్కించుకున్న సమంత, ఇకపై నిర్మాతగానూ మంచి పేరు దక్కించుకుంటుందేమో చూడాలి మరి.