అస్త్రం సంధించనున్న 'సవ్యసాచి'.!

మరిన్ని వార్తలు

'ప్రేమమ్‌' సినిమాతో దర్శకుడిగా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్‌ చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య రెండో సారి నటిస్తున్న చిత్రం 'సవ్యసాచి'. చాలా కాలంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఈ గురువారం గుమ్మడికాయ కొట్టనున్నారు. 

విభిన్న కథాంశంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. వచ్చే నెల్లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 'రంగస్థలం' సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన మైత్రీ మూవీస్‌ బ్యానర్‌ నుండి వస్తోన్న చిత్రం కావడంతో 'సవ్యసాచి'పై భారీ అంచనాలున్నాయి. సక్సెస్‌ఫుల్‌ అండ్‌ డిఫరెంట్‌ మూవీస్‌ డైరెక్టర్‌ చందూ మొండేటి దర్శకత్వంపైనా నమ్మకం ఉంది. 

ఇటీవలే 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రంతో ఓ మోస్తరు హిట్‌ కొట్టిన చైతూకి కెరీర్‌లో మరో మంచి సక్సెస్‌ని 'సవ్యసాచి' అందిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాలో చైతూ కుడిచేయి పని చేయని కుర్రాడి పాత్రలో నటిస్తున్నాడు. నిధీ అగర్వాల్‌ హీరోయిన్‌గా పరిచయమవుతోంది ఈ సినిమాతో. ఆల్రెడీ ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా టీజర్‌ కానీ, లేదంటే డైరెక్టుగా ట్రైలర్‌ కానీ విడుదల చేసే అవకాశాలున్నాయి. 

తమిళ హీరో మాధవన్‌ తెలుగులో తొలిసారి నటిస్తున్న చిత్రమిది. విలన్‌ పాత్రలో మాధవన్‌ కనిపించనున్నాడు. అలాగే సీనియర్‌ నటి భూమిక మరో కీలక పాత్రలో కనిపించనుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS