మామా అల్లుళ్ల జోరు మామూలుగా లేదండోయ్‌

మరిన్ని వార్తలు

ఎవరీ మామా అల్లుళ్లు అనుకుంటున్నారా? వెంకీ, నాగ చైతన్య. వీరిద్దరూ చైతూకి వెంకటేష్‌ స్వయానా మేనమామ అన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఒకేసారి జోరు పెంచేశారు. ఒక్కటి కాదు, రెండు కాదు, మూడు సినిమాలతో బిజీగా ఉన్నారీ మామా అల్లుళ్లు తెలుసా? 

ముందుగా వెంకటేష్‌ - తేజ కాంబినేషన్‌లో 'ఆటా నాదే వేటా నాదే' సినిమా ఆల్రెడీ సెట్స్‌పై ఉంది. తర్వాత వెంకీ - వరుణ్‌ తేజ్‌ మల్టీ స్టారర్‌ కూడా లైన్‌లోనే ఉంది. ఇప్పుడు తాజాగా వెంకీ - చైతూ కాంబినేషన్‌లో మరో మల్టీ స్టారర్‌ రానుంది. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి 'వెంకీ మామా..' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. 

మరోవైపు చైతూ నటిస్తున్న 'సవ్యసాచి' చిత్రం షూటింగ్‌ దాదాపు చివరి దశకు చేరుకుంది. మారుతి దర్శకత్వంలో 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రంలోనూ చైతూ నటిస్తున్నాడు. 'నిన్ను కోరి' డైరెక్టర్‌ శివ నిర్వాణ దర్శకత్వంలో లవ్‌స్టోరీ ఒకటి చేస్తున్నాడు చైతూ. ఈ సినిమాలోనే సమంతతో పెళ్లి తర్వాత తొలిసారిగా స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నాడు చైతూ. 

ఇకపోతే తాజాగా తెరపైకి వచ్చిన వెంకీతో మల్టీ స్టారర్‌ ఇప్పుడు టాలీవుడ్‌ ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌గా నిలిచింది. 'జై లవకువ' సినిమా తెరకెక్కించిన బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందట. ఈ సినిమాలో వెంకీ, చైతూ స్టన్నింగ్‌ క్యారెక్టర్స్‌లో కనిపించనున్నారట. 

త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కించే యోచనలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. సురేష్‌బాబు, కోనవెంకట్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS