యంగ్హీరో నాగశౌర్య నటించిన ‘అశ్వత్ధామ’ చిత్రం జనవరి 31న ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. మహిళపై జరుగుతున్న అకృత్యాల్ని ఎండగడుతూ, కొన్ని యదార్ధ గాధల్ని ఆధారంగా చేసుకుని నాగశౌర్య స్వయంగా తయారు చేసిన స్క్రిప్టుతో ఈ సినిమా రూపొందింది. రిలీజ్ తర్వాత సినిమా ఓకే అనిపించుకుంది. పెద్దగా వివాదాలు, కంప్లైంట్లు లేవు కానీ, ఓ మోస్తరు మౌత్ టాక్తో సినిమా రన్ అవుతోంది. ఈ లోగా హీరో నాగశౌర్యపై ఓ వివాదం తలెత్తింది. ఈ సినిమాని పర్సనల్గా తీసుకున్నాడు నాగశౌర్య. సొంత బ్యానర్లోనే సినిమాని రూపొందించాడు.
ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశాడనుకోండి. ఆ ప్రమోషన్స్లోనే ఓ చోట నోరు జారి, టాక్సీవాలాల మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడాడట. దాంతో, తెంగాణా ట్యాక్సీ డ్రైవర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసింది. తమ మనోభావాలు దెబ్బ తినేలా నాగశౌర్య మాటున్నాయంటూ, ఆయనపై తగు చర్యలు తీసుకోవాంటూ హెచ్ఆర్సీని కోరింది సదరు ట్యాక్సీ డ్రైవర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ. మరి, నిజంగానే నోరు జారాడో. లేక కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాడో తెలీదు కానీ, ఇక ఇప్పుడు నాగశౌర్య తన మాటు వెనక్కి తీసుకోవాల్సిందే. బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఫిర్యాదు దారులు డిమాండ్ చేస్తున్నారట. మరి ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న ఈ యంగ్ హీరో కాస్త దూకుడు తగ్గిస్తే కెరీర్కి మంచిదేమో.