నాగ్‌, అఖిల్ మల్టీస్టార‌ర్... క‌థ రెడీ!

మరిన్ని వార్తలు

అక్కినేని హీరోలంతా `మ‌నం`లో క‌లిసి సంద‌డి చేశారు. ఇప్పుడు నాగ‌చైత‌న్య‌తో ఓ సినిమా చేస్తున్నాడు నాగార్జున‌. `బంగార్రాజు`కి ప్రీక్వెల్ ఇది. ఇది అవ్వ‌గానే... అఖిలో ఓ మ‌ల్టీస్టార‌ర్ చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. అవును.. నాగ్, అఖిల్ క‌లిసి ఒకే స్క్రీన్‌పై సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. మోహ‌న్ రాజా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది.

 

`ధృవ‌` త‌మిళ మాతృక‌కి మోహ‌న్ రాజానే ద‌ర్శ‌కుడు. ఆ సినిమాతో.. మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడిగా నిరూపించేసుకున్నాడు. ఆ సినిమా చూసే `లూసీఫ‌ర్‌` రీమేక్ ని త‌న చేతుల్లో పెట్టాడు చిరు. ప్ర‌స్తుతం `లూసీఫ‌ర్‌` ప‌నులు శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయి. లూసీఫ‌ర్ అవ్వ‌గానే నాగార్జున, అఖిల్ ల మ‌ల్టీస్టార‌ర్ ని ప‌ట్టాలెక్కించాల‌న్న ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడ‌ట మోహ‌న్ రాజా. త్వ‌ర‌లోనే ఈసినిమాకి సంబంధించిన ఓ అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS