కరోనా కారణంగా టాలీవుడ్లో ఎక్కడా సినీ షూటింగ్స్ జరగడం లేదు. దాంతో చేతికి పనిలేక సినీ వర్కర్లు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే సినీ వర్కర్స్ని ఆదుకునే దిశగా మెగాస్టార్ సహా పలువురు సినీ ప్రముఖులు తమ వంతు విరాళాలు ప్రకటించారు. తాజాగా కింగ్ నాగార్జున సినీ వర్కర్స్ కోసం కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. కరోనా బాధితులకు సాయం చేసే దిశగా టాలీవుడ్ నుండి పవన్ కళ్యాణ్ 2 కోట్లు ప్రకటించగా, ప్రబాస్, చరణ్, అల్లు అర్జున్, నితిన్.. తదితర హీరోు తమ వంతు సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
సూపర్ స్టార్ మహేష్బాబు ఇప్పటికే కోటి రూపాయలు విరాళం అందించగా, మరో 25 లక్షల రూపాయలు తాజాగా అనౌన్స్ చేశారు. కరోనా కారణంగా దేశమంతా లాక్డౌన్లో ఉన్న వేళ, పేదలకు చేయూతగా ప్రభుత్వాలకు మద్దతుగా చాలామంది సెలబ్రిటీలు తమ వంతు సాయమందిస్తున్నారు. వారిలో ప్రణీత వంటి హీరోయిన్లు కూడా ఉన్నారు. కొందరు డబ్బు రూపంలో సాయం చేస్తుండగా, ప్రకాష్ రాజ్, రాజశేఖర్ వంటి మరికొందరు నటులు ఇతర మార్గాల్లోనూ సాయమందిస్తున్నారు.