బాబాయ్‌ హీరోయిన్‌తో అబ్బాయ్‌ 'స్పెషల్‌' కెమిస్ట్రీ.!

మరిన్ని వార్తలు

నందమూరి హీరో కళ్యాణ్‌రామ్‌ తాజాగా 'ఎంత మంచి వాడవురా' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'శతమానం భవతి' సినిమాతో ప్రేక్షకుల మనసుల్ని దోచిన సతీష్‌ వేగేశ్న ఈ సినిమాకి దర్శకుడు. కాగా, టెక్నాలజీ మాయలో పడి, జనం బంధాలు, అనుబంధాల్ని ఎలా పక్కన పెట్టేస్తున్నారో, తద్వారా జీవితంలో వారు ఏం కోల్పోతున్నారో.. అనే కధాంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడట సతీష్‌ వేగేశ్న.

 

ఈ సినిమాలో మెహ్రీన్‌ కౌర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, మరో భామ స్పెషల్‌ సాంగ్‌తో అలరించనుంది. ఆ భామ ఎవరో కాదు, 'జై సింహా' సినిమాలో బాబాయ్‌ బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా నటించి, మాంచి బీటున్న సాంగ్స్‌లో డాన్సులతో ఇరగదీసేసిన ముద్దుగుమ్మ నటాషా దోషి. ఆ సినిమా తర్వాత నటాషాకి మరో అవకాశం రాలేదు. అమ్మడిని అంతా మర్చిపోయారు కూడా. ఎలా పడిందో తెలీదు కానీ, సతీష్‌ వేగేశ్న - కళ్యాణ్‌రామ్‌ దృష్టిలో పడింది. అంతే, ఆలస్యం చేయకుండా, ఈ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ కోసం ఆఫర్‌ చేశారట.

 

ఎంతైనా నందమూరి హీరో, అసలే అవకాశాల్లేవ్‌. డాన్సింగ్‌ టాలెంట్‌ మెండుగా ఉందాయె. నిరూపించుకునే మరో ఛాన్స్‌ వచ్చినప్పుడు కాదంటుందా.? నో వే. స్పెషల్‌ సాంగ్‌ అయినా ఫర్లేదని వెంటనే ఓకే చేసేసిందట. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఇటీవలే ఈ సాంగ్‌ చిత్రీకరణ జరిగిందని తెలుస్తోంది. సాంగ్‌ అవుట్‌ పుట్‌ చాలా బాగా వచ్చిందట. మరోసారి ఈ పాటతో నటాషా దోషికి మంచి పేరు దక్కుతుందని చిత్రయూనిట్‌ భావిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS