సినీ నటి మాధవీలత కొన్నాళ్ల క్రితం భారతీయ జనతా పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ కార్యకర్తలు, అభిమానులే ఇప్పుడామెకు యాంటీ అయిపోయారు. కారణం ఆమె అతి ప్రవర్తనే. సోషల్ మీడియాలో నరేంద్రమోడీని ఉద్దేశించి ఓ కామెంట్ పెట్టింది. ఆమె ఉద్దేశ్యం నరేంద్రమోడీని పొగడటమే. కానీ కొంచెం కొత్తగా ఆలోచించి, నెగిటివ్ పబ్లిసిటీ చేయాలనుకుంది.
మోడీ దుర్మార్గుడు.. ఎందుకంటే దేశాన్ని అభివృద్ది చేస్తున్నాడు కాబట్టి అంటూ మోడీని వ్యతిరేకించే వారికి కౌంటర్ ఇచ్చింది. కానీ అది తేడాగా ప్రొజెక్ట్ అయ్యింది. మాధవీలతను తిడుతున్నారంతా. అయితే మాధవీలత మాత్రం తానేంటో బీజేపీ పెద్దలకు తెలుసనీ, తన భావం అందరికీ అర్ధమైందనీ, కొందరు మాత్రమే పని గట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారనీ మండిపడింది. ఆ సంగతి పక్కన పెడితే, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ తన ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చింది. మరి మాధవీలత ధైర్యమేంటి.?
ఇటీవల తెలంగాణా ఎన్నికల్లో రేష్మా రాథోడ్ అనే సినీ నటి బీజేపీ తరపున పోటీ చేసి దారుణంగా ఓడిపోయింది. మాధవీలతకు ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యం ఉందో లేదో కానీ, ఈ అతి తగ్గించుకుంటే మంచిది. అన్నట్లు మాధవీలత పవన్కళ్యాణ్కి వీరభిమాని. అది సినీ అభిమానం మాత్రమే. రాజకీయాల్లో తాను బీజేపీ మనిషినని చెప్పుకుంటుందీ 'నచ్చావులే' భామ.