ఈ వీడియోలో ఉన్నది ఎవరో గుర్తు పట్టారా.?

By iQlikMovies - January 22, 2019 - 11:50 AM IST

మరిన్ని వార్తలు

సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అవుతోంది. 1999లో అదో సీరియల్‌కి సంబంధించిన వీడియో. ఆ సీరియల్‌లో సీనియర్‌ హీరోయిన్‌ షావుకారు జానకి తో పాటు, మురళీ మోహన్‌ తదితరులు నటించారు. 'షిరిడీ సాయి పర్తి సాయి దివ్యకథ' అనేది ఈ సీరియల్‌ పేరు. చుట్టూ చాలా మంది పిల్లలు.. పిల్లలకు స్టోరీ చెబుతోన్న షావుకారు జానకి. చాలామంది పిల్లలున్నారు కదా. కరెక్ట్‌గా అబ్జర్వ్‌ చేస్తే, ఆ పిల్లల్లో మన సెన్సేషనల్‌ స్టార్‌ ఒకడున్నాడు. ఆయనే విజయ్‌ దేవరకొండ.

 

ఈ వీడియోని సోషల్‌ మీడియాలో ఓ నెటిజన్‌ పోస్ట్‌ చేశాడు. ఆ వీడియోలో ఉన్నది మీరేనా.? అని విజయ్‌దేవరకొండని అడిగాడు. ఆ నెటిజన్‌ ట్యాగ్‌ చేసిన ఆ వీడియోని చూసిన విజయ్‌ దేవరకొండ షాకయ్యాడట. అవును నిజమే. ఆ వీడియోలో ఉన్నది నేనే. ఈ వీడియోని పోస్ట్‌ చేసినందుకు చాలా థాంక్స్‌ అన్నాడు. సోషల్‌ మీడియాలో విజయ్‌దేవరకొండకున్న ఫాలోయింగ్‌ సంగతి అందిరికీ తెలిసిందే.

 

'రౌడీస్‌' పేరుతో విజయ్‌దేవరకొండ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంటారు. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రంలో నటిస్తున్నాడు. రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. గతేడాది 'ట్యాక్సీవాలా' చిత్రంతో హిట్‌ కొట్టిన విజయ్‌ దేవరకొండ త్వరలో 'డియర్‌ కామ్రేడ్‌'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS