నిఖిల్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌కి టైమొచ్చింది

మరిన్ని వార్తలు

నిఖిల్‌ కెరీర్‌ బెస్ట్‌ మూవీ అయిన ‘కార్తికేయ’కు ఎప్పటి నుండో సీక్వెల్‌ రూపొందించాలన్న నిఖిల్‌ కోరిక తీరే టైమొచ్చింది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. చాలా కాలంగా ఈ స్క్రిప్టుపై డైరెక్టర్‌ చందూ మొండేటి కసరత్తులు చేస్తున్నారు. ఎట్టకేలకు స్క్రిప్ట్‌ తుది దశకు రావడంతో, మార్చి 2న సినిమాని సెట్స్‌ మీదికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 2న వెంకన్న సన్నిధి (తిరుపతి)లో సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ చేయనున్నారట. ఈ సినిమాలో అనుపమా పరమేశ్వర్‌ హీరోయిన్‌గా నటించనుందని ప్రచారం జరుగుతోంది.

 

తొలి పార్ట్‌లో హీరోయిన్‌ అయిన కలర్స్‌ స్వాతి ఈ సినిమాలో గెస్ట్‌ రోల్‌ పోషించనుందనీ టాక్‌. సెంటిమెంట్‌ పరంగా స్వాతిని ఈ సినిమాలో నటించపచేయానుకుంటున్నారట. అందుకు స్వాతి కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అభిషేక్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో వివేక్‌ కూచిబొట్ల, టి.జి.విశ్వప్రసాద్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

 

ఇదిలా ఉంటే, నిఖిల్‌ సిద్దార్ద్‌ త్వరలో ఓ ఇంటి వాడు కానున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న నిఖిల్ ఏప్రిల్‌లో పెళ్లికొడుకు కానున్నాడు. ఇటీవల ‘అర్జున్‌ సురవరం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నిఖిల్‌కి ‘కార్తికేయ 2’ తోనూ మంచి సక్సెస్‌ రావాలని ఆశిద్దాం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS