ఈశ్వరి ఆర్ట్స్ పతాకంపై అమన్(రకుల్ ప్రీత్ సింగ్ బ్రదర్) ,సిద్ధిక హీరోహీరోయిన్లుగా వైకుంఠ బోను దర్సకత్వంలో బొలినేని రమ్య, వెలుగోడు శ్రీధర్ బాబు లు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం " నిన్నే పెళ్లాడతా". శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం టాకీ పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ " మంచి కమర్షియల్ హంగులున్న యాక్షన్ చిత్రమిది.
హీరోహీరోయిన్లులతో పాటు సాయికుమార్, సీత, ఇంద్రజ ల నటన ఈ చిత్రంలో హైలెట్ గా వుంటుంది. మంచి ఎమోషన్స్ తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది మా చిత్రం. రెండు పాటలు, రెండు ఫైట్స్ మినహా టాకీ మొత్తం పూర్తయ్యింది. డిసెంబరు ఎండింగ్ లో సినిమా రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం"అన్నారు.