ప్రముఖ సీనియర్‌ నటి గీతాంజలి.. ఇక లేరు..!

మరిన్ని వార్తలు

ప్రముఖ సీనియర్‌ నటి గీతాంజలి కన్నుమూశారు. గుండెపోటు రావడంతో ఆమెను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందుతూనే తుదిశ్వాస విడిచారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జన్మించిన గీతాంజలి.. ఎన్టీఆర్‌ దర్శకత్వం వహించిన సీతారామ కళ్యాణం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. తర్వాత కాలంలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లోనూ నటించారు.

 

కాలం మారింది, పూల రంగడు, శారద, డాక్టర్‌ చక్రవర్తి, పూలరంగడు, మురళీకృష్ణ, అవేకళ్లు, సంబరాల రాంబాబు, కలవారి కోడలు, గుఢచారి 116, దేవత, నిండు హృదయాలు చిత్రాలతో ఆమె మంచిపేరు సంపాదించారు. సెకెండ్ ఇన్నింగ్స్ లో క్యారక్టర్‌ ఆర్టిస్ట్‌గా కూడా ఆకట్టుకున్నారు. గోపి గోపిక గోదావరి, పెళ్ళైన కొత్తలో,మాయాజాలం, గ్రీకువీరుడు సినిమాల్లో నటించి మెప్పించారు. గీతాంజలి మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS