`అయ్యప్పయుమ్ కోషియమ్` రీమేక్ లో నటించడానికి పవన్ కల్యాణ్ ఒప్పుకున్న సంగతి తెలిసిందే. సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు. మరో కథానాయకుడిగా రానా పేరు కూడా దాదాపుగా ఖాయమే. పవన్ పక్కన సాయిపల్లవి నటించనుంది. మరి రానాకి జోడీ ఎవరన్నదే ప్రశ్న. ఇప్పుడు అందుకు సమాధానం దొరికేసింది. రానా పక్కన హీరోయిన్ గా నివేదా పేతురాజ్ ని ఎంచుకున్నట్టు టాక్.
మెంటల్ మదిలో సినిమాతో ఆకట్టుకుంది నివేదా. ఆ తరవాత.. బ్రోచేవారెవరురాలోనూ నటించింది. ఈ రెండు సినిమాలూ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. రానా పక్కన నివేదా అయితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోందట. ఇటీవల నివేదాని సైతం సంప్రదించినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా మొదలయ్యే ఛాన్సుంది. ఈలోగా రానా ఎంట్రీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేస్తుంది. అప్పుడే... నివేదా పేరూ ఖరారు చేసే అవకాశాలున్నాయి.