అదే అసలు మజా అంటోన్న ముద్దుగుమ్మ

మరిన్ని వార్తలు

మామూలుగా సెలబ్రిటీలు ఎక్కువగా స్పెషల్‌ స్క్రీన్స్‌లోనే సినిమాలు చూస్తుంటారు. కానీ పబ్లిక్‌ ధియేటర్స్‌లో సినిమా చూస్తేనే అసలు సిసలు మజా అంటోందీ క్యూట్‌ బ్యూటీ నివేదా థామస్‌. 

'జెంటిల్‌మెన్‌' సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ మలయాళ కుట్టీ తర్వాత 'నిన్ను కోరి', 'జై లవకుశ' వంటి చిత్రాలతో సక్సెస్‌ అందుకుంది. అయితే అవకాశాలు మాత్రం అరుదుగా అందుకుంటోంది. అందుకు కారణం కూడా ఉంది. ఈమెకు చదువంటే ఇష్టం. అందుకే యాక్టింగ్‌ని కొంచెం పక్కన పెట్టి, చదువుపై కాన్‌సన్‌ట్రేషన్‌ చేసింది. ఆర్కిటెక్ట్‌లో డిగ్రీ పూర్తి చేసింది. ఇప్పుడు స్టడీస్‌ కంప్లీట్‌ అయిపోయాయి కాబట్టి, ఇకపై యాక్టింగ్‌పైనే ఫుల్‌ ఫోకస్‌ పెట్టిందట. ఆ దిశగా ఆల్రెడీ ఓ క్రేజీ ప్రాజెక్టును సొంతం చేసుకుంది. 

నందమూరి హీరో కళ్యాణ్‌రామ్‌ సినిమాలో నివేదా థామస్‌ హీరోయిన్‌గా ఎంపికైంది. గుహన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నివేదా స్టన్నింగ్‌ క్యారెక్టర్‌లో కనిపించనుందట. నివేదాతో పాటు, 'అర్జున్‌రెడ్డి' ఫేం షాలినీ పాండే కూడా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. 

ఇదే కాక మరో మెస్మరైజింగ్‌ ప్రాజెక్టు ఒకటి చర్చల దశలో ఉందట. త్వరలోనే ఆ కొత్త ప్రాజెక్టు వివరాలు వినడానికి ఫ్యాన్స్‌ని సిద్ధంగా ఉండమంటోంది క్యూట్‌ బ్యూటీ నివేదా థామస్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS