సాయిధరమ్‌ సినిమాకి ఎన్టీయార్‌ క్లాప్‌

మరిన్ని వార్తలు

సాయిధరమ్‌ తేజ్‌ కొత్త సినిమా 'జవాన్‌' పేరుతో రూపొందుతోంది. బివిఎస్‌ రవి దర్శత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. సాయిధరమ్‌ సరసన నాని హీరోయిన్‌ మెహరీన్‌ కౌర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో. సోమవారం ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఎన్టీయార్‌, వినాయక్‌ ఈ సినిమా ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీయార్‌కి థ్యాంక్స్‌ చెప్పాడు సాయిధరమ్‌ తేజ్‌. ఈ మధ్య హీరోల ఫ్యాన్స్‌ మధ్య గొడవలు బాగా తలెత్తుతున్నాయి. కానీ హీరోలు మాత్రం తమ మధ్య ఐకమత్యాన్ని చాటి చెబుతూనే ఉన్నారు. అభిమానుల మధ్య మాత్రమే గొడవలు. హీరోలు మాత్రం తమ స్నేహాన్ని వీలైన ప్రతీ సందర్భంలోనూ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మొన్న మంచు మనోజ్‌ 'గుంటూరోడు' సినిమాకి సాయి ధరమ్‌ తేజ్‌ గెస్ట్‌గా హాజరయ్యాడు. ఇప్పుడు సాయి ధరమ్‌ తేజ్‌ సినిమా ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్‌ రావడం అభినందించదగ్గ విషయం. సాయి ధరమ్‌ తేజ్‌ది అందరితోనూ కలిసిపోయే మనస్తత్వం. ఇండస్ట్రీలో అందరితోనూ చాలా స్నేహంగా మెలగుతాడు. ఆ స్నేహంతోనే తన తోటి హీరోల సినిమాల్లో గెస్ట్‌ రోల్స్‌ చేయడానికి ముందుకొస్తున్నాడు. సందీప్‌ కిషన్‌ సినిమా 'నక్షత్రం'లో తేజు నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మనోజ్‌ కోసం కూడా ఓ సినిమా చేస్తాడట. తాజాగా ఎన్టీఆర్‌, సాయి ధరమ్‌ తేజ్‌ కోసం తన సినిమా ప్రారంభోత్సవానికి రావడం మెగా ఫ్యాన్స్‌కీ, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కీ కూడా ఆనందాన్ని కలిగించింది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS