సంపత్‌నంది 'పేపర్‌బోయ్‌' వచ్చేదెప్పుడంటే.!

మరిన్ని వార్తలు

మాస్‌ మసాలా డైరెక్టర్‌ సంపత్‌ నంది కథతో తెరకెక్కుతోన్న చిత్రం 'పేపర్‌బోయ్‌'. జయశంకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సంతోష్‌ శోభన్‌, రియా సుమన్‌, తాన్యా హోప్‌ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి సంపత్‌ నంది నిర్మాణ భాగస్వామ్యం కూడా వహిస్తున్నారు. 

అయితే స్టార్‌ డైరెక్టర్లు కథలందిస్తున్న చిత్రాలు ఈ మధ్య అంతగా విజయం సాధించడం లేదు. అభిరుచి గల కథలను అందిస్తున్నా, ఆ సినిమాలు ఆశించిన ఫలితాల్ని అందుకోవడంలో నిరాశపరుస్తున్నాయి. ఇటీవల మారుతి కథతో ప్రేక్షకుల ముందుకొచ్చిన 'బ్రాండ్‌బాబు' చిత్రం ఇదే తరహాలో వెనక్కి వెళ్లిపోయింది. తాజాగా 'పేపర్‌బోయ్‌' టైటిల్‌తో వస్తున్న సంపత్‌ నంది చిత్రంపై అంతగా ఎక్స్‌పెక్టేషన్స్‌ లేవు కానీ, కథ పరంగా ఒకింత ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తోంది. 

పేపర్‌బోయ్‌గా పని చేసే ఓ బీటెక్‌ విద్యార్థి ప్రేమ కోసం ఏం చేశాడు. అసలెందుకు ప్రేమలో పడ్డాడు? లైఫ్‌ని చాలా ప్రాక్టికల్‌గా తీసుకునే ఆ అబ్బాయి జీవితంలో ప్రేమ ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందనే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌ ఆశక్తిని రేకెత్తించేలా ఉంది. సంపత్‌ నంది డైలాగులు హత్తుకునేలా ఉన్నాయి. అయితే సినిమా విడుదలయ్యాక ఎలాంటి రిజల్ట్‌ అందుకుంటుందో ఇప్పుడప్పుడే అస్సలు అంచనా వేయలేం. 

ఇంతకీ ఈ సినిమా ఎప్పుడొస్తుందంటారా? సెప్టెంబర్‌ 7న. ఆ రోజే 'పపర్‌బోయ్‌' రిలీజ్‌కి ముహూర్తం ఫిక్స్‌ చేశారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS