ఈ రోజుల్లో రీషూట్లన్నవి మామూలైపోయాయి. సినిమా అంతా అయిపోయాక... రషెష్ చూసుకుని, తప్పొప్పుల్ని సరిదిద్దుకుని, రీషూట్లు చేసుకుని సినిమా వదులుతున్నారు. 'సీత' సినిమాకీ ఇలానే రీషూట్లు జరిగాయి. ఈ విషయాన్ని దర్శకుడు తేజనే స్వయంగా ఒప్పుకున్నాడు. కాజల్ ప్రధాన పాత్ర వహించిన చిత్రమిది. ఈనెల 24న విడుదల కాబోతోంది. సీత షూటింగ్ పూర్తయినవెంటనే తేజకు కొన్ని డౌట్లు వచ్చాయట. అందుకే పరుచూరి బ్రదర్స్కి ఈ సినిమా చూపించాడట తేజ. వాళ్లు కొన్ని మార్పులూ చేర్పులూ సూచించారు.
వాటి అనుగుణంగా సినిమాని రీషూట్ చేశారు. అలా.. సినిమాకి రిపేర్లు జరిగాయి. పరుచూరి బ్రదర్స్ కి ఇలాంటి రిపేర్లు చేయడం మామూలే. ఈమధ్య విడుదలైన కొన్ని పెద్ద సినిమాలకు పరుచూరి బ్రదర్స్ 'స్క్రిప్టు డాక్టర్స్'గా పనిచేశారు. స్క్రిప్టు మొత్తం పూర్తయ్యాక అది పరుచూరి చేతుల్లోకి రావడం, అది పూర్తిగా చదివి, తమవైన సలహాలు ఇవ్వడం వాళ్లకు అలవాటైపోయింది. ఈసారి మాత్రం సినిమా పూర్తయిన తరవాత... వాళ్లు ఎంటర్ అయ్యారు. మరి పరుచూరి సలహాలు ఈ సినిమాకి ఎంత వరకూ హెల్ప్ అయ్యాయో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.