తిరిగి తిరిగి.. రౌడీ ద‌గ్గ‌ర‌కే వ‌చ్చాడా?

మరిన్ని వార్తలు

స‌ర్కారు వారి పాట త‌ర‌వాత‌.... ప‌ర‌శురామ్ కొత్త సినిమా ఏదీ ప‌ట్టాలెక్క‌లేదు. అక్కినేని నాగ‌చైత‌న్య‌తో `నాగేశ్వ‌ర‌రావు` అనే సినిమా ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ... అనూహ్యంగా ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. దాంతో... ప‌ర‌శురామ్ కి మ‌రో హీరో కావాల్సివ‌చ్చింది. ఈలోగా చాలామంది హీరోల‌కు క‌థ‌లు వినిపించాడు ప‌ర‌శురామ్. ఎక్క‌డా వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. ఇప్పుడు తిరిగి.. తిరిగి విజ‌య్ దేవ‌రకొండ ద‌గ్గ‌ర‌కే వ‌చ్చి ఆగిన‌ట్టు టాక్‌.

 

విజ‌య్ దేవ‌ర‌కొండ - ప‌ర‌శురామ్ కాంబినేష‌న్లో... `గీత గోవిందం` వ‌చ్చిన సంగ‌తి తెల‌సిందే. ఆ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్. రౌడీకి అమ్మాయిల్లో, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియ‌న్స్‌లో ఫ్యాన్ బేస్ ని పెంచిన సినిమా అది. విజయ్ కెరీర్‌లో తొలి వంద కోట్ల సినిమా. ఆ త‌ర‌వాత‌... ఇప్పుడు ఈ కాంబో మ‌ళ్లీ కుదిరింది. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని టాక్‌. ఇది వ‌ర‌కు అటు విజయ్‌, ఇటు ప‌ర‌శురామ్ దిల్ రాజు బ్యాన‌ర్‌లో సినిమాలు చేయ‌డానికి అడ్వాన్సులు తీసుకొన్నారు. అందుకే ఈ కాంబో ఈజీగా సెట్ట‌యిపోయింద‌ని టాక్‌. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ `ఖుషి` సినిమాతో బిజీగా ఉన్నాడు. అది పూర్త‌వ‌గానే... ప‌ర‌శురామ్ సినిమా మొద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే నాగ‌చైన‌త్య‌కు చెప్పిన క‌థే అటూ ఇటూ మార్చి తీస్తున్నాడా? లేదంటే పూర్తిగా కొత్త క‌థ ఎంచుకొన్నాడా? అనే విష‌యాలు తెలియాల్సివుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS