పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీలో ఏకంగా ఒకటి కాదు, రెండు కాదు, ఐదు ప్రాజెక్టుల వరకూ లైన్లో పెట్టేశాడన్న సమాచారం ఉంది. అందులో ఒకటి క్రిష్ ` పవన్ కళ్యాణ్ కాంబోలో తెరకెక్కుతోన్న పీరియాడికల్ మూవీ. ఇటీవలే లాంఛనంగా స్టార్ట్ అయిన ఈ సినిమా కామ్గా రెగ్యులర్ షూటింగ్ కూడా జరిగిపోతోందనే వార్త ఫ్యాన్స్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఇప్పటికే ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా ‘వకీల్ సాబ్’ సినిమా పూర్తి చేసేశాడు పవన్ కళ్యాణ్. అది పూర్తి కాగానే, క్రిష్ మూవీ కూడా అలాగే పట్టాలెక్కించేశాడట. మొగలాయి కాలం నాటి బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతోందంటూ, ఈ సినిమా గురించి ఓ ఫస్ట్లుక్ రిలీజ్ చేశారు అప్పట్లో.
తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ యాక్షన్ సీన్ చిత్రీకరణ జరుగుతోందంటూ లీకు బయటకి వచ్చింది. కోహినూర్ వజ్రం దొంగిలించే నేపథ్యంలో ఈ యాక్షన్ సీన్ చిత్రీకరణ జరుగుతోందని మాట్లాడుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ, ఈ సీన్కి ‘షాడో ఫైటర్’ అనే ఓ వీడియో గేమ్ ప్రేరణ అంటూ, ప్రచారం జరుగుతోంది. అయితే, ఇలాంటి యాక్షన్ ఘట్టాలి తెరకెక్కించడంలో క్రిష్ ఘటికుడు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ యాక్షన్ సీన్ని చాలా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడట. సినిమాలో ఈ యాక్షన్ సీక్వెన్స్ చాలా బావుంటుందట. ‘మగధీర’, ‘బాహుబలి’ యాక్షన్ ఘట్టాల తర్వాత ఈ యాక్షన్ సీన్ గురించి మాట్లాడుకుంటారని లీకు వీరులు చెబుతున్న మాట. అయితే, ఈ లీకులోని నిజమెంతో నిదానంగా తెలియాల్సి ఉంది.