క్రిష్ టీమ్ కి షాకిచ్చిన ప‌వ‌న్‌

మరిన్ని వార్తలు

ప‌వ‌న్ క‌ల్యాణ్ - క్రిష్ కాంబినేష‌న్ లో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి వీరూపాక్ష అనే పేరు ప‌రిశీలిస్తున్నారు. ఏ.ఎం.ర‌త్నం తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం కోసం వంద కోట్ల బ‌డ్జెట్ కేటాయించారు. ఈ యేడాదే ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌న్న‌ది చిత్రబృందం ప్లాన్‌. కానీ ముందు నుంచీ ఈసినిమాకి అనుకోని ఆటంకాలు ఎదుర‌వుతున్నాయి. లాక్ డౌన్ వ‌ల్ల‌... షూటింగ్ అర్థాంత‌రంగా ఆగిపోయింది. లాక్ డౌన్ త‌ర‌వాత కూడా ఈ సినిమా షూటింగ్ స‌జావుగా సాగే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. లాక్ డౌన్ ఎత్తేసినా స‌రే, సినిమా షూటింగులో పాల్గొన‌డం త‌న‌కు కుద‌ర‌క‌పోవొచ్చ‌ని క్రిష్ బృందానికి ప‌వ‌న్ సూచ‌న ప్రాయంగా చెప్పాడ‌ట‌. దానికి కార‌ణం `వ‌కీల్ సాబ్‌`. బాలీవుడ్ లో ఘ‌న విజ‌యం సాధించిన పింక్ చిత్రానికి ఇది రీమేక్‌.

 

మేలో విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. అయితే లాక్ డౌన్ వ‌ల్ల ఈ సినిమా విడుద‌ల డైలామాలో ప‌డింది. ఈనెల 14తో లాక్ డౌన్‌తో ఎత్తేసే అవ‌కాశాలున్నాయి. ఆ త‌ర‌వాత షూటింగులు మొద‌ల‌వుతాయి. ముందు వ‌కీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసిన త‌ర‌వాతే .. క్రిష్ సినిమా మొద‌లెట్టాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నాడు. లాక్ డౌన్ ఎత్తేసి, షూటింగులు మొద‌లైతే, 20 రోజుల పాటు ఏక‌ధాటిగా వ‌కీల్ సాబ్‌కి ప‌వ‌న్ డేట్లు ఇవ్వ‌బోతున్నాడ‌ట‌. ఆ త‌ర‌వాతే క్రిష్ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడ‌ట‌. దాంతో క్రిష్ బృందం డైలామాలో ప‌డింది. లాక్ డౌన్ త‌ర‌వాత ప‌వ‌న్ వ‌చ్చేస్తాడ‌ని, షూటింగు మొద‌లెట్టుకోవ‌చ్చ‌ని అంచ‌నా వేసిన క్రిష్ బృందం ఇప్పుడు ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS